Sunday, October 4, 2020

అనంతపురంజిల్లాలో సాహితీస్రవంతి_ నివేదిక 9/2019




                                 
            సాహితీ స్రవంతి కి పార్టీతో సరైన అనుసంధానం  జిల్లాలో లేనందున ఫ్రాక్షన్ ఏర్పాటు అవసరమని కుమారస్వామి
భావించి రాంభూపాల్ గారితో సంప్రదించి ప్రగతి,రవిచంద్ర,యమున ,కుమారస్వామి గార్లతో ఒక ఫ్రాక్షన్ ను ఏర్పాటుచేయడం
జరిగింది.
           కా!రాంభూపాల్ గారి సలహా మేరకు  కల్బుర్గి మొదలైన సాహిత్యకారుల హత్యలను ఖండిస్తూ నిరసన సమావేశాన్ని నిర్వహించాము. రాష్టృ కేంద్రం స్వేచ్చా స్వరం పుస్తకాన్ని  2016 డిసెంబరులో ఆవిష్కరించారు.ఆ సందర్భంగా అనంతపురం నుండి 50000 రూపాయల యాడ్స్ సేకరించి పంపినాము .

                     2017 ఫిబ్రవరి లో సాహితీ స్రవంతి ప్రచురించిన "అనంత సాహితీ సమాలోచన" పుస్తకాన్నిప్రచురించి ఆవిష్కరించాము .2017 ఏప్రిల్‌లో 30న వివిధ సాహిత్య సంఘాల తో కలిసి వేమన సాహిత్యం పైరాష్ట్ర సదస్సును నిర్వహించాము.ప్రజానాట్యమండలి వేమన రూపకాన్ని ప్రదర్సించింది.పార్టీ సహకారం లేకుండా ఇంత పెద్ద కార్యక్రమం జరిగేది కాదు.దీని కోసం రూ. 4.85  లక్షలు విరాళాలు సేకరించాము. ఇందులో దాదాపు 3.49 లక్షలు ఖర్చు అయింది.. రాష్ట్ర కేంద్రానికి 50000 మొత్తాన్ని అక్టోబరులో పంపినాము.రాష్ట్రకేంద్రం కోరినపిమ్మట రాంభూపాల్ గారితో సంప్రదించి ఈ మొత్తాన్ని పంపాము.
      జూన్ నెలలో శ్రీ శ్రీ వర్ధంతి నిర్వహించాము. ప్రతి సంవత్సరం జరిగినట్లే జూలై 2017 లో
కార్యకర్తలకు ఒక ' కార్యశాల 'నిర్వహించి నూతన జిల్లా కమిటీని నగర కమిటీని నిర్మించాము. ఈ కార్యశాలకు రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్ గారు  హాజరయ్యారు. కార్యశాలలో "సాహిత్యం లో ప్రాపంచిక దృక్పథం" పై పిళ్ళాకుమారస్వామి, కథాపరిణామక్రమం పై రాచపాలెం సంఘ నిర్మాణం పనిపద్దతులపై వొరప్రసాద్ ప్రసంగించారు. జిల్లా గౌరవాధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి , అధ్యక్షులుగా కటకం కృష్ణవేణి , ప్రధాన
కార్యదర్శిగా చెన్నా రామమూర్తి ,కోశాధికారిగా అశ్వర్త రెడ్డి లను ఇతరకమిటీ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. జులైలో 'రాయలసీమ సాహిత్యంం' పై ఒక పుస్తకాన్ని ప్రచురించాము . కదిరిలో జాషువా వర్ధంతి ని, నసీర్ అహమ్మమద్ రచించిన హిందూ ముస్లింల ఐక్యత కు ప్రతి రూపాలు అనే  పుస్తకావిష్కరణ
జరిపాము.హిందూపురం లో సాహిత్య అకాడమీ తోకలిసి  కథల్లో చేతివృత్తుల పై సదస్సు నిర్వహించాము .
                 నవంబరులో వేమన సభ కు కొనసాగింపుగా 13 పుపుస్తకాల పై సమీక్ష సదస్సు నిర్వహించాము. డిసెంబరులో" ఆధునిక సాహితీ ప్రస్తానము"  పుస్తకాన్ని ఆవిష్కరించాము.
ప్రధాన కార్యదర్శి చెన్నా రామమూర్తి ఉద్యోగ రీత్యా బదిలీ కావడం తో దాముగట్ల
హిదయాతుల్లా ను ప్రధాన కార్యదర్శి గా ఫ్రాక్షన్ లో నిర్ణయించి తీసుకున్నాము.
                        2018 లో ఫిబ్రవరినుండి "వర్తమాన సాహితీ తరంగాలు" పేరుతో ప్రతి నెలా అనంతపురం లో
ఉన్న వర్తమాన  సాహితీ మూర్తుల రచనలను కొత్త తరానికి పరిచయం చేసే కార్యక్రమాన్ని చేపట్టినాం .ఇది నవంబరు
నెల వరకు సాగింది.   ఇందులో పాల్గొన్న   వారికీ సాహిత్య విమర్శ ఎలా చేయాలన్న  దానిపై రాచపాళెం గారితో 
రెండు గంటలు క్లాసు కూడా నిర్వహించాము. ప్రతి కార్యక్రమంలో అధ్యక్షత వహించడానికి   కమిటీ సభ్యులకే ప్రాధాన్యత నిచ్చాము. ఈ కార్యక్రమం ద్వారా సాహిత్య కారుల్లో సాహితీ స్రవంతి పట్ల సానుకూల ధోరణి ఏర్పడింది. అదే సమయం లో కొన్ని అవాంఛనీయ ధోరణులు తలెత్తాయి . కొంత మందిలో సాహితీస్రవంతి పట్ల అసూయ లాంటివి కూడా ఏర్పడ్డాయి.
మార్చి లో దాదాఖాలందర్ ప్రధాన కార్యదర్శిగా ,  రసూల్ అధ్యక్షులుగా ప్రగతి   ఉపాధ్యక్షులుగా నగరకమిటీ ఏర్పడింది. 
వీరి ఆధ్వర్యం లో ఉగాది కవిసమ్మేళనం,పుస్తకావిష్కరణ జరిగాయి. కొత్తగా వచ్చిన వారిలో కెరీరిస్టు లక్షణాలు ఉన్నాయి.వారిలో
ఉన్న ఈ లక్షణాన్ని మన సంఘం సమన్వయం చేసుకోలేక వారిని వదులు కున్నది. వారి సామాజిక తరగతిని బట్టి వారిని 
మనం  నిలుపు కోగలిగి ఉంటె బాగుండేది. నగర కమిటీ ని రాష్ట్ర కేంద్రం సలహా మేరకు రద్దు చేయడం జరిగింది. 
జూన్ నెలలో సాహిత్యశాల నిర్వహించాం . జూలై లో నూతన జిల్లా కమిటీ ని  నియమించడం జరిగింది. ఈ 
కమిటీ లో గౌరవాధ్యక్షులుగా కుమారస్వామి , అధ్యక్షులుగా ప్రగతి , ప్రధాన కార్యదర్శి గా హిదయతుల్లా మొదలైన 
వారున్నారు. వేమన సదస్సు సందర్బంగా నిర్ణయించిన  మేరకు వేమన సాహిత్య పీఠం కు అధ్యక్షులు గా ఏలూరి 
ఎంగన్న ,ప్రధాన కార్యదర్శిగా కృష్ణవేణి గార్లను నియమించడం జరిగింది. ఆయేషా హత్య ఉదంతానికి సంబంధించి నిరసన గళాలనుప్రజానాట్యమండలి తో కలిసి నిర్వహించాము. ప్రగతి గారు రాసిన కోయిలచెట్టుపుస్తకాన్ని కుమార స్వామి గారు రాసిన మట్టిపోగు పుస్తకాన్ని ఆవిష్కరించాము. ఎడారి బతుకులు ,కటిక పూలు పుస్తకాలను ఆవిష్కరించాము.
          హిందూపురంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో బాధ్యులు నాగశేషు ,అశ్వర్థ నారాయణ లు కలిసి సాహిత్య అకాడమీ సహకారంతో అక్టోబర్ లో సింపోసియం నిర్వహించారు. గురజాడ శ్రీశ్రీ జాషువాల జయంతులను కూడా నిర్వహించారు.
                              2019 మార్చి నెలలో అనంతపురం లో మహిళా దినోత్సవం ,జూన్ లో శ్రీశ్రీ జయంతి, జూన్ నుండి ఇప్పటివరకు  నెలనెలా సాహితీ సంగమం లో భాగంగా కవిత్వంతో కరచాలనం ,కథాసంగమం కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం . ఐద్వా చేపట్టిన కందుకూరి  శత వర్ధంతి కార్యక్రమాలలో ప్రధాన పాత్రను సాహితీ స్రవంతి తీసుకుంది. 
          ఈ సంవత్సరం జూన్ నెలలో కదిరిలోఎద్దుల సిద్ధారెడ్డి  స్మారక సాహిత్య పోటీలు కథ, కవిత్వంలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో  కుమారస్వామి నిర్వహించారు. అదేవిధంగా ఎద్దుల సిద్ధారెడ్డి  స్మారకార్థం కడపలో రాయలసీమ సాహిత్యంపై సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో కుమారస్వామి నిర్వహించారు.
                       సాహితీ స్రవంతి కోశాధికారిగా రవిచంద్ర గారు ఉన్న సమయం లో వేమన సదస్సు సందర్బంగా కుమారస్వామి,రవిచంద్ర కలిసి  సాహితీ స్రవంతి పేరుతొ అకౌంట్ ను స్టేట్ బ్యాంకు లో తెరిచారు.రవిచంద్ర గారు దీనికి తగిన సమయం కేటాయించలేక కుమారస్వామిని నిర్వహించమన్నారు.దీనికి సంబందించిన జమ ఖర్చు వివరాలను కింది పత్రం లో చూడగలరు. 

Thursday, September 24, 2020

అనంతపురం జిల్లాలో సాహితీస్రవంతి ప్రస్థానం



                          


           అనంత పురం జిల్లాలో సాహితీ స్రవంతి
ప్రస్థానం ప్రారంభమైంది. పిళ్ళా కుమారస్వామి రెడ్డి
డా. గేయానంద్,డా. మోక్షప్రసూన లతో 
సాహితి స్రవంతి కోసం ఏర్పడిన కన్వీనింగ్ కమిటీ 2002 నుండి పనిచేయడం ప్రారంభించింది. అప్పటి నుండి శ్రీశ్రీ ,జాషువా, గురజాడ వర్థంతులను లేదాజయంతులను క్రమం తప్పకుండా సాహితీ స్రవంతి   నిర్వహిస్తూ వస్తోంది.
        2003లో అమెరికా ఇరాక్ పై యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో సాహితీ స్రవంతి 'యుద్ధవ్యతిరేక కవితాగళాలు' పేరుతో ఇరాక్ పై అమెరికా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ కవి సమ్మేళనం
నిర్వహించింది. ముందస్తు ఎన్నికలపై కవితాగానాన్ని నిర్వహించింది. 
         అనేక ప్రజాసంఘాలు 2005 లో సమగ్రాభివృద్ధి కోరుతూ చేస్తున్న అనంతపురం  జిల్లాలో ప్రజాఉద్యమాలు జరుపుతున్న నేపథ్యంలో 'జిల్లా వెనుకబాటుతనం నిర్మూలన' పైసాహితీ స్రవంతి కవి సమ్మేళనం నిర్వహించింది. 2007 లో కులవివక్ష వ్యతిరేక పోరాట కమిటి జిల్లాలో సామాజిక న్యాయం, కులవివక్ష అంశాలపై సైకిల్ యాత్ర నిర్వహించింది. ఆ సందర్భంలో సాహితీస్రవంతి 'కులవివక్షపై కవితాసమరం' పేరుతో కవిసమ్మేళనం నిర్వహించింది.వారికి మద్దతుగా సాహితీ స్రవంతి కన్వీనరు పిళ్ళా కుమారస్వామి సైకిలు యాత్రలో పాల్గొన్నారు. 
      వివిధ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు కథ, కవిత్వ రచనలలో పోటీలు నిర్వహించింది. తరువాత జిల్లాలో పేదలు చేస్తున్న భూపోరాటానికి అక్షరసంఘీభావం పేరిట శ్రీ శ్రీ వర్థంతి రోజున కవి సమ్మేళనం నిర్వహించింది. 

           సాహితీ స్రవంతి ఉద్యోగ, ఉపాధ్యాయ
రంగాలలో సాహిత్య కార్యక్రమాలను నిర్వహించి
వారిలో సాహితీ సృజనగలవారిని గుర్తించాలని
నిర్ణయించింది. అప్పటి నుండి సెప్టెంబరు 5 ఉ
పాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యా యులకు కథ, కవిత్వంలో సాహి త్య పోటీలు నిర్వహించి బహుమతులను అందజే యటం
ప్రారంభించింది.
         జీవితబీమాసంస్థలో కడప డివిజన్ లోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని ఉద్యోగులందరికి కవితల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేసింది.
       సాహితీ స్రవంతి చురుకుగా పనిచేయడం వల్ల రాష్ట్ర స్థాయిలో,జిల్లా స్థాయిలో సాహిత్య రంగంలోని ఇతర సంఘాల కదలికలు పెరిగాయి.రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తివాదులూ, సంప్రదాయవాదులు, పాలకవర్గాలు, కార్పొరేట్ వర్గాల పాత్ర కూడా సాహిత్య రంగంలో పెరిగింది. సాహిత్య ప్రముఖుల్లో
ఊగిసలాట ధోరణులు కొనసాగుతున్నాయి. విశాల ప్రాతిపదికన వారందరినీ కలుపుకొని సాహితీ స్రవంతి పనిచేయసాగింది. అనంతపురంలో స్త్రీ, దళిత,మైనార్టీ, బహుజనవాదాల పై చర్చ జరిగిన తరువాత ఆధునికాంతర ధోరణులు జిల్లాలో సాహిత్య రంగంలో ప్రవేశించాయి.
         పేద ప్రజలు 2007లో ప్రభుత్వ మిగులు భూములు పంచాలని భూపోరాటం చేస్తున్నారు. ఆ సందర్భంగా ముదిగొండలో భూపోరాటం చేస్తున్న ప్రజల పై కాల్పులు జరిపి ఐదుమందిని పొట్టన పెట్టుకొంది ప్రభుత్వం. దీనికి నిరసనగా సాహితీస్రవంతి నిరసన గళాలను నిర్వహించింది. అలాగే రాష్ట్రస్థాయిలో వచ్చిన కవితాగ్రహాన్ని 'భూస్వరాలు' పేరుతో సాహితీ స్రవంతి రాష్ట్ర శాఖ కవితా సంకలనాన్ని తీసుకువచ్చింది.  ఈ సంకలనంలో అనంతపురం కవులు రాసిన కవితలు చాలా ఉన్నాయి.
         విశాఖకు సంబంధించిన యు.ఎ. నరసింహారావు గారు రచించిన 'కన్యాశుల్కం - ఆధునిక భారతీయ నాటకాల'తో పాటు భూస్వరాలు ను కూడా  సాహితీ స్రవంతి ఆవిష్కరించింది. 

           జిల్లా, నగర స్థాయిల్లో అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడం వల్ల వచ్చిన సంబంధాలతో 2011లో సాహితీ స్రవంతికి
జిల్లా స్థాయి కమిటీ ఏర్పడటానికి అవకాశం ఏర్పడింది.
       ప్రధాన కార్యదర్శిగా తగరం క్రిష్ణయ్య,
జిల్లా అధ్యక్షునిగా పిళ్లా కుమారస్వామి, కార్యదర్శులుగా ఆకుల రఘురామయ్య,
ముకుందాపురం పెద్దన్న, ఉపాధ్యక్షులుగా అంకె
రామలింగమయ్య, ఎర్రిస్వామి, కోశాధికారిగా ప్రజ్ఞ సురేష్, సభ్యులుగా ఆవులజయప్రద (ఉరవకొండ), శివన్న (మడకశిర),రామకృష్ణ, శేషాచార్యులు, జూటూరి షరీఫ్ తో  జిల్లా స్థాయి కమిటీ ఏర్పడింది. నూతన కమిటీ చురుకుగా అనేక కార్యక్రమాలను నిర్వహించింది. జిల్లా స్థాయి కవితా సంకలనం
తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది. ప్రారంభించిన కొంతకాలానికి తెలంగాణా
ఉద్యమం, సమైక్యాంధ్ర ఉద్యమం రావడంతో సాహిత్య రంగంలో స్తబ్దత ఏర్పడింది.
సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ ఈ ఉద్యమాలపట్ల తటస్థ వైఖరితో ఉండాలని నిర్ణయించింది. ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు సాహిత్యకారులను చీలుస్తు న్నాయని ఇవి ప్రపంచీకరణకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి దోహదపడవని
సాహితీ స్రవంతి భావించింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఆవిర్భవించింది. ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమ
కారుల ఆవేశాలు, ఆశలు చల్లారిపోయాయి. ఆ సందర్భంలో అనంతపురం జిల్లాలోని చాలా మంది సాహిత్యకారులు సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.
       అంతకుముందు జిల్లా వ్యాప్తంగా ఆహ్వానించగా వచ్చిన కవితలను సంస్కరించి మల్లెల నరసింహమూర్తి పిళ్ళా కుమారస్వామి సంపాదకత్వంలో 'అనంత
కవితాస్వరాలు' పేరుతో కవితా సంకలనాన్ని సాహితీ
స్రవంతి తీసుకు వచ్చింది. ఈ పుస్తక ఆవిష్కరణకు
ముందుగా 'చిక్కనవుతున్న పాట' పేరుతో ఒక కవితా సంకలనాన్ని సాహితీస్రవంతి ప్రచురింది. దీనిని ప్రముఖ విమర్శకులు సూర్యసాగర్ ఆవిష్కరించారు. అదే సందర్భంలో రెండవ
జిల్లా కమిటీ కూడా ఏర్పడింది. కమిటీలో ప్రధాన కార్యదర్శి'గా ప్రజా సురేష్, అధ్యక్షులుగా పిళ్ళా కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా అంకె రామలింగ మయ్య, బాల భారతమ్మ, కార్యదర్శులుగా రియా జుద్దీన్, ఆకుల రఘురామయ్య గార్లు బాధ్యతలు తీసుకున్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అనంత కవితాస్వరాలు పుస్తకావిష్కరణ సభకు మేడిపల్లి రవికుమార్ గారు తిరుపతి నుంచి
వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా డా. గేయానంద్ గారు పాల్గొన్నారు.

       అనంత కవితా స్వరాలు కవితా సంకలనాన్ని పరిచయం చేసేందుకు కదిరి, హిందూపురం, ఉరవకొండ, ధర్మవరం ప్రాంతాలలో జిల్లా అధ్యక్షులు పిళ్ళా కుమారస్వామి  పర్యటించి జనకవనాలను కూడా నిర్వహించారు. ఆ సందర్భంగా కదిరిలో ఆ శాఖ అధ్యక్షులుగా చలపతి, ప్రధాన కార్యదర్శిగా చిన్నారావులతో ఒక కమిటీ ఏర్పడింది. హిందూపురంలో డా|| నాగశేషు, అశ్వర్ధ నారాయణ
ప్రధానకార్యదర్శి, అధ్యక్షులుగా వ్యవహరిస్తూ కమిటీ ఏర్పడింది. ఉరవకొండలో ఆవుల వెంకటేశులు గంగాధర్ లు అధ్యక్ష కార్యదర్శులుగా కమిటీ ఏర్పడింది. ధర్మవరంలో నూతన శాఖ ఏర్పడింది. ఈ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఇటికంటి మహేష్, అధ్యక్షులుగా శారద, ఉపాధ్యక్షులుగా సత్యనిర్ధారన్ తదితరులతో కమిటీ నిర్మాణం జరిగింది.
         నెలనెలా క్రమం తప్పకుండా సంవత్సరం
పాటు సాహితీ సమయం కార్యక్రమాన్ని నిర్వహిం
చడం ద్వారా అనంతపురం నగర కమిటీ కూడా
ఏర్పడటానికి దోహదపడింది. నగర కమిటీలో
అధ్యక్షులుగా వై. సూర్యనారాయణరెడ్డి, నగర ప్రధాన కార్యదర్శిగా పోకూరి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా నీరుగంటి వేంకటేశు, కార్యదర్శిగా రవిచంద్ర బాధ్యతలు తీసుకున్నారు.
అనంతపురం నగర కమిటీ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా కవులు రచయితలతో 2016 సం|| కేలండర్‌ను రూపొందించి ఆర్ట్స్ కళాశాలలో ఆవిష్కరించింది. అలాగే ఆర్ట్స్ కళాశాలతో కలిసి జిల్లాలోని దివంగత సాహిత్యకారులపైప్రతి నెలా 3వ ఆదివారం సాహితీ సమాలోచన ఆ కళాశాల తెలుగుశాఖతో
కలిసి నిర్వహించాలని నిర్ణయించింది. 
      ప్రథమంగా మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21న 'వేమన-సామాజిక దృక్పథం' పై నిర్వహించిన సభలో అప్పిరెడ్డి హరినాథరెడ్డిముఖ్యవక్తగా హాజరై ప్రసంగించారు. హిందూపురం, ధర్మవరం, అనంత పురంకమిటీలు కూడా మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించాయి. మార్చి నెలలో మహిళా దినోత్సవాన్ని ధర్మవరం, అనంతపురం, హిందూ పురం శాఖలు నిర్వహించాయి.
       ఏప్రిల్ మాసంలో జిల్లా శాఖ కథ, కవిత్వంలపై
సాహిత్యశాల నిర్వహిం చింది. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పడిన ప్రాంతీయ కమిటీ సభ్యులతో మూడవ జిల్లా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీలో అధ్యక్షులుగా ప్రగతి, ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర, ఉపాధ్యక్షులుగా సత్య నిర్ధారన్ (ధర్మవరం), అశ్వథనారాయణ (హిందూ పురం), వై. సూర్యనారా
యణరెడ్డి (అనం తపురం), సహాయ కార్యదర్శులుగా నీరుగంటి వెంకటేసు (అనంతపురం), ఇటికంటి మహేష్ (ధర్మవరం) పిళ్ళా కుమారస్వామి (రాష్ట్ర
కమిటి సభ్యులు, కోశాధికారి), సభ్యులుగా నానీల నాగేంద్ర (అనంతపురం, నర్సిరెడ్డి (పెనుగొండ), తిప్పేస్వామి (కళ్యాణదుర్గం), గంగాదేవి,ధరిత్రీదేవి, యమునా, హిదయతుల్లా, రసూల్, శ్రీధర్ నాయుడు, చంద్రశేఖర్ (యూనివర్శిటీ),
లక్ష్మినారాయణ (యూనివర్శిటీ) బాధ్యతలు
తీసుకున్నారు.
         సాహిత్యశాలలో రాయలసీమ కథా చిత్రంపై
సింగమనేని నారాయణ, కథలెలా రాస్తారు పై శశికళ,
బండి నారాయణస్వామి, సాహిత్య పరిణామ క్రమంపై పిళ్ళా కుమారస్వామి, కవిత్వంలో వస్తువు పై రాధేయ, కవితా శిల్పంపై మల్లెల నరసింహమూర్తి  బోధించారు. సాహితీ స్రవంతి ఆవిర్భావంపై జంధ్యాల రఘుబాబు వివరించారు.
        ఆంధ్రరాష్ట్రం విడిపోయాక జిల్లాలో రాయలసీమ ప్రత్యేక ఉద్యమ సన్నాహాలు రచయితలు మేధావులతో ప్రారంభమయ్యాయి. రాయలసీమ, అందులోఅనంతపురం జిల్లా పూర్తిగా వెనుకబడి ఉంది. అందువల్ల ఈ ఉద్యమం అనంతపురంలోనే రాజుకుంటున్నది. కొంత మంది రచయితలు బహిరంగంగా దీనినిప్రోత్సహిస్తున్నారు. అంతేగాక ప్రపంచీకరణ ప్రభావంతో జిల్లాలో భాషా సంస్కృ
తులపై పెనుప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు భాషా సంస్కృతులనురక్షించు కోవాలని సాహితీస్రవంతి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగు తున్నది.
       వర్తమాన పరిస్థితుల్లో సాహితీ స్రవంతి కొత్తతరం సాహితీ సృజనకారులను
గుర్తించి ప్రజాసాహిత్యకారులుగా తీర్చిదిద్దాల్సిన కర్తవ్యాన్ని గుర్తించింది. జిల్లాలో సాహిత్యా
భివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఉగాది రోజున తూతూ మంత్రంగా కవిసమ్మేళనాలను నిర్వహిస్తోంది. అధికార భాషాసంఘం నామ మాత్రంగా కూడా లేదు. అదే సందర్భంలో వర్ధమాన సాహిత్యకారుల్లో సాహిత్యం
పట్ల తపన ఉండటం గమనార్హం. వీరి తపనను గుర్తించి సాహితీ స్రవంతి సాహిత్యకార్యశాలలను విరివిగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. 

పాతతరం సాహిత్యకారుల స్ఫూర్తిని పొందేందుకు నెల నెలా అనంతపురం నగరశాఖ జిల్లాలోని
దివంగత సాహిత్య కారులపై సాహితీ సమాలోచన ను చేపట్టింది. వేమనపై అప్పిరెడ్డి హరినాథ రెడ్డి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ సాహిత్యంపై అంకె శ్రీనివాస్, గుత్తిరామకృష్ణపై సాయినాథ్, తలమర్ల కళానిధిపై ఆశావాది ప్రకాశరావు మరియు
ఆయన కుమారుడు తలమర్ల శ్యామ్ సుందర్, బెల్లూరు శ్రీనివాసమూర్తి సాహిత్యంపైఏలూరి ఎంగన్న ఆయన కుమార్తె సర్దేశాయి తిరుమలరావుపై రాచపాళెం, విద్వాన్ విశ్వంపై ఏలూరి ఎంగన్న, కోగిర జైసీతారాంపై ఆయన కుమారుడు కోగిరజయచంద్రా రెడ్డి, ఏలూరి ఎంగన్నతో కలిసి ప్రసంగించారు.
సాహితీస్రవంతి, సాహిత్య అకాడమి సహకారంతో 'కార్మిక సాహిత్యం' పై 2016 డిసెంబరు 25న సదస్సు నిర్వహించింది. కదిరిలో 'ఇప్పుడు వీస్తున్న
గాలి' పేరుతో నెలనెలా వర్తమాన కవులు, రచయితల పుస్తకాలపై సమీక్షలు,సాహిత్య గోష్టి నిర్వహిస్తున్నారు.
      ప్రభుత్వం వేమన, రాళ్ళపల్లి, తలమర్ల కళానిధి, మొదలైన సాహిత్యకారుల విగ్రహాలను కలెక్టరు కార్యాలయం బయట నెలకొల్పాలి. సాహిత్య ప్రస్థానం పత్రికను ప్రజలలోకి విరివిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సాహిత్యకారులు తమపుస్తకాలను ప్రచురించుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక సహా యాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాన్ని వెనుకబడిన అనంతపురం జిల్లాలో ఏర్పాటుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

( అనంత సాహితీ సమాలోచన నుండి)

___పిళ్లా విజయ్

Friday, September 11, 2020

2016లో పురస్కార సభ లో సింగమనేని




జిల్లాస్థాయిలో కథల పోటీ నిర్వహించి పిళ్లా కుమారస్వామి తల్లిదండ్రుల పేర్లతో పిళ్లా లక్ష్మి రెడ్డి పిళ్లా రామలక్ష్మి పురస్కారం అందజేశాము.ముఖ్య అతిథిగా సింగమనేని నారాయణ గారు హాజరై
కథల గురించి కొత్త కథకులకు మార్గదర్శనం చేయించారు.




Thursday, August 27, 2020

రౌండ్ టేబుల్ సమావేశం10.1.18


రౌండ్ టేబుల్ సమావేశానికి సాహితీస్రవంతి గౌరావాధ్యక్షులు పిళ్లా కుమారస్వామి అధ్యక్ష త వహించారు.ఆయన మాట్లాడుతూ నేడు దేశంలో హిందూత్వ శక్తులు దలితులపై ముస్లిం మైనారిటీ లపై దాడులు చేస్తొందని దీన్ని కవులు రచయిత లు ప్రజాసంఘాలు ఖండించాలని కోరారు.

ప్రముఖ చరిత్ర అధ్యాపకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ భీమా నది ఒడ్డున కోరేగావ్ గ్రామం లో ప్రతి సంవత్సరం దలితులు తమ పోరాట యొదులను స్మరించు కొంటున్న సందర్భంలో హిందూత్వ శక్తులు దాడులు చేశాయని దీనికి ప్రతిఘటన గా దళితులు వామపక్షాలు అభ్యుదయ శక్తులు బంద్ జరగడం అ. పూర్వమైనదని ఇలాంటి పోరాటాలను అందరూ సమర్తించాలని ఆయనకోరారు.ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ శ్రామిక వర్గ దృక్పథం అలవరుచుకోవాలన్నారు.కులవివక్ష పోరాట నాయకులు నల్లప్ప ~ బిసి సంఘ నాయకులు నాగరాజు , గన్నా నాయక్ ~ ప్రగతి~  రియాజుద్దీన్ , సురేష్, నాగేశ్వరాచారి, తరిమెల అమర్ నాధరెడ్ది, రాజమోహన్, యాడికి సూర్యనారాయణ రెడ్డి ,ె.   జెన్నె ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


కదిరిలో విద్యార్థులకు కథల పోటీలు




2019 డిసెంబర్ లోవేమన ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు కథల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర, యస్ యఫ్ ఐ నాయకులు బాబ్ జాన్ బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా సాహితీ స్రవంతి జిల్లా గౌరవా ధ్యక్షులు పిళ్లా కుమార స్వామి మాట్లాడుతూ విద్యార్థుల్లో మంచి సృజనాత్మక శక్తి ఉందని దానిని వెలికి తీయటానికి కథ కవిత్వ వ్యాసరచన మొదలైన సాహిత్య పోటీలు ఉపకరిస్తాయని చెప్పారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో  ఈ పాఠశాలలో నెలనెలా కథల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి చదువులో బాగా రాణిస్తారని చెప్పారు. ఎస్ఎఫ్ఐ నాయకులు  బాబ్ బాన్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ స్వర్ణోత్సవాల సందర్భంగా  భగత్ సింగ్ పై వ్యాస రచన పోటీలు కూడా నిర్వహిస్తామని విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పారు . కార్యక్రమాన్ని  సమన్వయ  పరచిన కృష్ణ మూర్తి రాజు  మాట్లాడుతూ పిళ్లా కుమార స్వామి  సాహిత్యరంగంలో విశేష కృషి జరుపుతున్నారని, విద్యార్థి లోకాన్ని  కూడా సాహిత్య రంగం లోకి తీసుకురావడం కోసం కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో  లో తెలుగు ఉపాధ్యాయులు పవన్ ,రమణ ,హరి ప్రసాద్ రెడ్డి,  జయంతి ,చలపతి ,లతీఫ్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. బహుమతులు పొందిన వారిలో ఫర్హాన్, సోహెల్, శ్రావణ్ కుమార్ , కేదార్నాథ్ ,ఈ ఎస్ కరిష్మా విద్యార్థులు ఉన్నారు

సింపోయిజం


సాహితీస్రవంతి సాహిత్య అకాడెమీ సంయుక్తంగా కన్నడ తెలుగు కథల్లో సామాజిక మార్పు‌అంశం పై సింపోయిజం ను ఈ నెల 29న శనివారం రోజున.    హిందూపురం లోని‌సప్తగిరి డిగ్రీకళాశాలలో      జరుపుతున్నట్లు సాహితీస్రవంతి జిల్లా గౌరవాధ్యక్షు లు పిళ్లా కుమారస్వామి    ఒ క ప్రకటన లో తెలిపారు.ఈ సమావేశానికి సాహిత్యాకడెమీ సంచాలకులు ప్రముఖ కవి కె శివారెడ్డి అధ్యక్సులుగా,అకాడెమీ సభ్యులు రాచపాళెం చంద్రసేఖర రెడ్డి కీలకోపాన్యసకులుగా ,పరిచయకర్థగా కుమారస్వామి, అకాడెమీ భాధ్యులు మహాలింగేస్వర్ హాజరవుతున్నారు.ఇందులో వివిధ అంశాలపై రచయితలు పత్రసమర్పణ చేస్తారు.సాహిత్యాభిమానులు హాజరై సభను జయప్రదం చేయాలని పిళ్ళాకుమారస్వామి కోరారు.27.9.2018

2018 లో నగర కమిటీ






సాహితీ స్రవంతి అనంతపురం నగరంలో సాహిత్య కార్యక్రమాలను విరివిగా నిర్వహించడానికి ప్రజాశక్తి బుక్ హౌస్ దగ్గర సాహితీ స్రవంతి కార్యాలయం లో సభ్యులు హాజరై జిల్లా గౌరవాధ్యుక్షులు పిళ్ళాకుమారస్వామి, జిల్లా అధ్యక్షులు కటకం క్రిష్నవేణి,జిల్లా    ప్రధానకార్యదర్సిహిదయతుల్లా సమక్షంలో నగర కమిటీ ని 6.3.2018న ఎన్నుకున్నారు. కమిటీ లో నగరాధ్యక్షులుగా నగరూరు రసూల్,ప్రధానకార్యదర్సిగా దాదా ఖలందర్,ఉపాధ్యక్షులుగా మడూరు ప్రగతి,రాముడులను,సహాయకార్యదర్సిలుగా యల్ ఆర్ వెంకటరమణ, కిశోర్ లను,కోశాధికారి గా రాంప్రసాద్ ను,కమిటీ సభ్యులు గా లహరి,సుధాకర్,నిర్మల,నానీల నాగేంద్ర,ఆదినారాయణ, జెన్నె ఆనంద్,మిద్దెమురలీక్రిష్న,జూటూరిషరీఫ్,యమునారాణి,ముకుందాపురం పెద్దన్న,రియజుద్దీన్,షేక్షావలిలను ఎన్నుకొన్నారు.తదనంతరం ఈ నెల మార్చి 18న ఉగాది కవిసమ్మేలనం నిర్వహించాలని కమిటీ నిర్నయించింది.అల్లాగే శ్రీ శ్రీ ,జషువా,గురజాడ జయంతులను నిర్వహించాలని, విధ్యార్తులకు కవితల పోటీలు నిర్వహించాలని కమిటీ సమావేశం నిర్నయించిందని జిల్లా అధ్యక్షులు క్రిష్నవేణి ఒకప్రకటనలో తెలిపారు.



అనంత సాహిత్య రంగంలో చెరగని చిరునామా ఆశావాది ప్రకాశ రావు



సాహితీ స్రవంతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డా! ఆశావాది సాహిత్యం పైన 22.4.2018న సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కటకం క్రిష్ణ వేణి , ఖట్టే వాలే దాదా ఖలందర్, చిట్రా రామ్మోహన్ , అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. కటకం క్రిష్ణ వేణి మాట్లాడుతూ ఆశావాది ఒక సాహితీ వట వృక్షం అనీ వర్ధమాన సాహిత్య కారులు ఆయన సాహిత్యం అధ్యయనం చేయాలని కోరారు. సాహితీ స్రవంతి జిల్లా గౌరవ అధ్యక్షులు పిళ్ళ కుమార స్వామి మాట్లాడుతూ ఆశావాది బాల్యం నుండి ఎన్నో కష్టాలు కడగండ్లు అవమానాలను చిరునవ్వుతో ఎదుర్కొని సుదీర్ఘ సాహితీ ప్రస్థానంలో ఎన్నో మైళ్లు రాళ్ళు దాటారు అన్నారు. తనది కవితా కులమని సగర్వంగా చెప్పిన ఆశావాది అందరికీ ఆదర్శనీయుడు అన్నారు.నగర  కార్య  దర్శి దాదా ఖలందర్ మాట్లాడుతూ ఆశావాది తెలుగు సాహిత్యానికి చేసిన సేవ విశిష్టతమైనదని అమోఘమైనది కొనియాడారు. చిట్రా రామ్మోహన్ మాట్లాడుతూ దళితులు పడే కష్టాలను తమ పద్యాల్లో వివరించిన సాహిత్య జీవి ఆశావాది అని కొనియాడారు. ఆశావాది అవధానాలపై మల్లిపూడి రవిచంద్ర మాట్లాడుతూ అవధాన ప్రక్రియ కొన్ని వర్గాలకే చెందినదనే  అభిప్రాయాన్ని  బద్దలు కొడుతూ దళితుడైన ఆశావాది స్వయం కృషితో అవధాన విద్యలో సాధికారత సాధించారని అన్నారు.అష్టావధానాలు ఎన్నో చేసి చాలా రచనలు చేశారు అన్నారు. ఆశావాది పద్య రచనల పై ఏలూరి ఎంగన్న మాట్లాడుతూ ఆశావాది పద్యాలు హృదయానికి హత్తుకునే విధంగా వినడానికి ఇంపుగా ఉంటాయి అన్నారు. ఆశావాది సాహిత్య వ్యాసాలలో వీటూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వర్తమాన సామాజిక అంశాలను తన సాహిత్య వ్యాసాల్లో వ్రాశారు అన్నారు. ఆశావాది వచన కవిత్వం అంతరంగ తరంగాలుపై దాముగట్ల హిదయతుల్ల మాట్లాడుతూ ఆశావాది కవిత్వంలో రైతాంగ సమస్యలు,  ప్రపంచీకరణలో సంక్షోభ జీవితం గురించి ఎక్కువగా ఉంది అన్నారు. షేక్ రియాజిద్దీన్ తో  సభ ప్రారంభం అయి సత్య నిర్ధారణ వందన సమర్పణ తో కార్యక్రమం అంతపురం  ప్రెస్ క్లబ్ లో చాలా ఘనంగా జరిగింది.

2016 లో నూతన జిల్లా కమిటీ


17.4. 2016 ఆదివారం నాడు జరిగిన సాహిత్యశాల లో జిల్లా వ్యప్తంగా గా వచ్చిన సాహితీ స్రవంతి కార్యకర్తలతో అనంతపురం లో మూడవ నూతన జిల్లా కమిటీని  ఎన్నుకొన్నారు.  జిల్లా ప్రధాన కార్యదర్శిగా రవిచంద్ర గారిని ,అధ్యక్షురాలిగా ప్రగతిగారిని  ,ఉపాధ్యక్షులుగా వై సూర్యనారాయణ రెడ్డి ,సత్యనిర్దారన్(ధర్మవరం) ,అశ్వర్థనారాయణ
(హిందూపురం)  గార్లను ,కార్యదర్శులుగా నీరుగంటి  వేంకటేశు ,పిళ్ళా కుమారస్వామి, ఇటికంటి మహేష్(ధర్మవరం)  గార్లను ఎన్నుకొన్నారు . కమిటీ సభ్యులుగా హిదయతుల్లా ,యమున ,రసూల్,నాగేంద్ర, ,శ్రీధర్నాయుడు, గంగాదేవి ,ధరిత్ర్రీదేవి, చంద్రశేఖర్(యూనివర్సిటి) ,లక్ష్మీనారాయణ(యూనివర్సిటి) ,నర్సిరెడ్డి(పెనుగొండ ) ,ఆవుల వెంకటేశులు(ఉరవకొండ ), రాజశేఖర్(కదిరి )తిప్పేస్వామి(కల్యాణదుర్గం)గార్లను ఎన్నుకొన్నారు . 

2016 లో అనంతపురం లో సాహిత్యశాల

            17.4.2016 న అనంతపురంలో సాహిత్యశాల కార్యక్రమానికి పర్యవేక్షకులుగా వై   సూర్యనారా యణ రెడ్డి  (నగర అధ్యక్షులు) ,ప్రజ్ఞా సురేష్ ఆచార్యులుగా  వ్యవహరించారు . ముఖ్య అతిధి గా సింగమనేని నారాయణ ,ఆత్మీయ  అతిధి గా జంధ్యాల రఘుబాబు ,ప్రారంభ  భోధకునిగా పిళ్ళా కుమారస్వామి పాల్గొన్నారు .సింగమనేని నారాయణ గారు   రాయలసీమ కథాచిత్రము గురించి ప్రసంగించారు. కథలు వ్రాసేవారు ముందుగా ప్రసిద్ధ కథలను చదవాలన్నారు. ముఖ్యంగా మార్క్సిస్టు దృక్పథాన్ని అలవరుచుకొవాలాన్నరు. ప్రతి విషయాన్ని చారిత్రిక  గమనం లో చూడాలన్నారు . మార్క్సిజమంటే చాలామంది భయపడుతుంటారని అది సరియైనది కాదని ఆయన అన్నారు .కథ మొట్టమొదట కోస్తా ప్రాంతంలో ప్రారంబమైందని దీనికి కారణం అక్కడ నీళ్ళు వుండటం ,నాగరికత అభివృద్ధి చెందటం గా  చూడవచ్చని ఆయన అన్నారు. నీళ్ళు లేని రాయలసీమలో కత చాలా  ఆలస్యంగా మొదలైనదన్నారు. మార్క్సిస్టు ఆలోచన విధానం తో మొట్టమొదట రాసిన వారు కడపజిల్లా వారని  వారిలో ముఖ్యులు రాచమల్లు రామచంద్రారెడ్డి ,కేతు  విశ్వనాథరెడ్డి ,సొదుం జయరాం ,రామకృష్ణారెడ్డి మదలైన వారున్నారనిఆయన     పేర్కొన్న్నారుసామాజిక చారిత్రిక దృక్పథముతో చూడకుండా సాహిత్యాన్ని అధ్యనం చేయలేమని సింగమనేని అన్న్నారు. ప్రగతిశీల దృక్పథం వున్నవే చరిత్రలో నిలుస్తాయన్నారు .పాలకవర్గ భావాలే ప్రజల భావాలుగా వుంటా యన్నారు. కథలో వస్తువును ఇతివృత్తం అంటారు. రాసేవిదానాన్ని రూపం అంటారు .  భావజాలాన్ని దృక్పథం అంటారు . సమాజ పరిణామంతో  సంబందం లేకుండా  చూస్తె   అర్థం కాదన్నారు. 

 


కుమారస్వామి  తరువాత సాహిత్య  పరిణామక్రమాన్నివివరించారు . 18వ శతాబ్దంలో యూరప్ లో వచ్చిన పారశ్రామిక విప్లవం ఫలితంగా అక్కడ రొమాంటిసిజం వచ్చింది . దానిప్రభావం మనదేశం లో 20వ శతాబ్దం లో వచ్చింది . బ్రిటిష్  ఆంగ్లవిద్యని  ప్రవేశ పెట్టడం వల్ల  భారతీయుల భావజాలం లో మార్పు వచ్చింది . రాజరామమోహనరాయ్ బ్రహ్మసమాజాన్న్ని సాపించడం వలన సతీ సహగమనం పై పోరాడటం మూలంగా దాని ప్రభావం ఆంధ్రదేశం పై పడింది . అందువల్ల ఇక్కడ భావకవిత్వం వచ్చింది .నండూరి సుబ్బారావు ,కృష్ణశాస్త్రి ,మొదలైన వారంతా భావకవిత్వం లో  మునిగిపోయారు . స్త్రీ పురుషులమధ్య కామసంబంద భావాలు లేకుండా స్నేహ సంబంధ భావాలు  వుండటం భావకవిత్వ లక్షణం . 1920 నాటికి గాంధీ  జాతీయోద్యమ ప్రభావం వలన మాలపల్లి నవలను  వున్నవలక్ష్మినారాయణ రాశారు .గురజాడ ఆధునిక కథానిక దిద్దుబాటు వచ్చింది . అప్పటికే కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం అనే కావ్వ్యాన్ని  రాశారు . దీన్ని ఆధునిక కవిత్వానికి వేగుచుక్కగా భావిస్తారు .భావకవిత్వం పోయి  జాతీయోద్యమకవిత్వం ప్రారంభమైంది . 1930 నాటికి ప్రపంచంలో ఆర్ధిక సంక్షోభంవచ్చింది . ఫలి తంగా బ్రిటన్ లో లెఫ్ట్ వింగర్స్ తమ న్యూ  సిగ్నేచర్స్ అనే కవితా సంకలనాన్ని రాశా రు . 1930 లో ఇటలీలో ముస్సోలినీ ,జర్మనీలో  హిట్లర్ ల ఫాసిజం విజయవంతం అయింది .  1935 లోఫాసిజానికి  వ్యతిరేకంగా పారిస్ లో రోమారోలా ,వేల్స్ ,థామస్ మాన్ మాక్సింగోర్కీ మొదలైన రచయతలు సమావేశమై ఒక మహాసభ జరిపారు. అందులో భారత దేశం నుండి సజ్జాద్ జహీద్ ,ముల్కరాజ్ ఆనంద్ ,జె సింఘీష్ ,ప్రమోద్సేన్ గుప్తా వంటి వాళ్ళు పాల్గొన్నారు. ఆతరువాత  మన దేశం లో 1936లో ప్రేమ్చంద్ అధ్యక్షతన అభ్యుదయ రచయతల మహాసభ జరిగింది . ఈ సభ కు మన ఆంధ్రదేశం నుండి అబ్బూరి రామకృష్ణారావు  హాజరయ్యారు . అబ్బూరి   రామకృష్ణారావు విశాఖ వచ్చిన తరువాత శ్రీ శ్రీ ,పురిపండా   అప్పలస్వామి లతో కలిసి  ఆంద్ర లేఖిని సంఘం స్తాపించారు . శ్రీశ్రీ  భావకవిత్వం నుండి అభ్యుదయ కవిత్వం లోకి ప్రవేశించారు . 

1942 లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది . ప్రపంచ యుద్ధం జరుగుతూ వుంది . ఫాసిజం రష్యా చేతిలో ఓడిపోతూ వుంది  1943లో తాపిధర్మారావు అధ్యక్షతన అభ్యుదయ రచయతల  సంఘం ఏర్పడింది శ్రీ మహాప్రస్తానంఆరుద్ర త్వమేవాహం ,సోమసుందర్ వజ్రాయుధం,రమణారెడ్డి అ డవి ,గంగినేని ఉదయిని మొదలైన కవిత సంపుటాలు   వచ్చాయి . చాసో కుంకుడాకు ,బొండుమల్లెలు ,కుక్కుటేశ్వర మ్ మొదలైన  కథలు రచించారు . 1935-45 వరకు అభ్యుదయం మొదటి దశ ,ఆతరువాత 1945 -50వరకు రెండవ దశగా భావించవచ్చు . రెండవ దశలో తిలక్,కుందుర్తి ,మొదలైన వారున్న్నారు. వీరంతా నెహ్రూ ప్రభావంలో  వున్నారు. వీరు శాంతి గీతాలను ఆలపించారు. 1950  నుండి 1965 వరకు సాహిత్యరంగంలో స్తబ్దత ఏర్పడింది . అయితే 1952 లో సాహిత్య అకాడెమీ ఏర్పడింది . 1952 లో పాలగుమ్మి  పద్మరాజు రాసిన  గాలివాన కథకు అంతర్జాతీయ బహుమతి లభించింది . ఈ కాలం లో సాహిత్యం ఒక వుద్యమంగా సాగలేదు 1955లో  లో  ప్రేమ  కథలు వచ్చాయి . ఈ కథలన్నీ మధ్య తరగతికి చెందిన కాలేజీచదువుకొనే   అబ్బాయి అ మ్మాయి ల ప్రేమ కథలు ..55-67 మధ్య తిలక్ కథలు వచ్చాయి . ఇవన్నీ పునాదిలేని కథలు . 1952లో  కమ్యూనిస్తుపార్టీ  ఎన్నికల్లో ఓడిపోయింది . అభ్యుదయ కవులంతా సినిమారంగం లోకి వెళ్ళిపోయారు . 1964లో కమ్యునిస్టు పార్టీ చీలిపోయింది . 1950లో  అమెరికాలో బీట్నిక్స్ కవులు  వచ్చారు . బ్రిటన్లో యాంగ్రీయంగ్మన్ కవులు నేక్డ్ పొయట్స్ వచ్చారు . 1958లో బెంగాల్ లో ఆకలితరం కవులు తిరుగుబాటు చేసారు . వీరి ప్రభావం వల్ల కావచ్చు 1965లో  స్తబ్దతను బద్దలు చేస్తూ దిగంబరకవులు వచ్చారు . తమకవిత్వానికి దిక్ లని పేరు పెట్టారు .


వీరునగ్నముని ,నిఖిలేశ్వర్,జ్వాలాముఖి ,చెరబండరాజు మహాస్వప్న ,భైరవయ్య . వీళ్ళు లైంగిక ప్రతీకలను తమ కవితల్లో వాడారు . అశ్లీలత ఎక్కువ . సమాజానికి షాక్ ట్రీట్మెంట్ అనేవాళ్ళు . ఇవన్నీ స్త్రీలను కించపరిచేవిధంగా ఉండేవి .పుండ్లు    పడిపోయిన వక్షం ,పుచ్చిపోయిన పిండం ,మెదడు పురుగు తినేసింది. చర్మం కుళ్ళిపోయింది . అవయవం  పుచ్చిపోయింది . కళ్ళకి కన్నం పడింది . 

1969-71లో కిర ణ్ బాబు ,దేవిప్రియ,ఓల్గా ,కమలనాథ్ లు  పైగంబరకవులుగా వచ్చారు . 1968-70 ,వరంగల్ లో కిషన్రావు ,సుదర్సన్రాలవు లోచన్ ,యాదగిరిరావు ,వరవరరావు ,టంకశాల అశోక్  తిరగబడు కవులుగా వచ్చారు . 1967 లోసి పి  యం  పార్టీ  చీలిపోయింది . సిపిఐ (యమ.ల్ ) ఎర్పడింది  . అదే సందర్బంలో  1970 లో శ్రీ శ్రీ  షష్టి  పూర్తీ జరుగుతుండగా  రచయతలారా మీరెటువైపు అనే కరపత్రం వేసి  శ్రీ శ్రీ తో సహా చాలామంది విరసం ఏర్పాటు చేసారు . శ్రీ శ్రీ అధ్యక్షుడు గా అయ్యాదు. కోకు ,రావిశాస్త్రి ,కే.వి.ఆర్ ,కారాగద్దర్ ,వంగపండు,నగ్నముని,జ్వాలాముఖి ,కే.శివారెడ్డి ,వరవరరావు ,నిఖిలేశ్వర్  మొదలైన వారు చేరారు . సృజన మాసపత్రిక  ప్రారంబ మైన్ది. కాని 1975 నాటికి విరసం తన ప్రాభవం కోల్పోయింది . విరసం లో చీలికలు వచ్చాయి . జనసాహితి  ఏర్పడింది . ఇదికూడా మళ్ళీ చీలిపోయింది . 


1980లో స్త్రీ వాదం దళిత వాదం  ప్రవేశించాయి . 1960-70 లలో యూరప్ దేశాలలో వచ్చిన స్త్రీ వాదం 1980 లలో ఆంధ్రదేశం లో  ప్రవేశించింది .1980లో రష్యాలో పెరిస్త్రోయికా గ్లాస్నోస్త్  మొదలైన మార్పులు వచ్చాయి .  1983లో తెలుగు దేశం పార్టీ ఆవిర్బవించింది . రామారావు మహిళకు ఆస్తిహక్కులో సమానవాటా ఇస్తానని ప్రకటించి అధికారములోకి వచ్చాడు . మగకీ ఆడకీ శీలాన్నీ ఆస్తినీఎ సమంగా వర్తిమ్పించండి  / కాగితాల మీద  వేదికల మెడ కాదు. ,నిజంగా సమంగా వర్తిమ్మ్పించండి ఇలా  కవిత వచ్చింది .   1993లో నీలిమేఘాలు  కవితా సంకలనం వచ్చింది . స్త్రీ వాదం క్రింది సమస్యలను ప్రస్తావించింది . స్త్రీని పురుషుడు దోపిడీ చేస్తున్నాడు . 2. స్త్రీఎ పురుషుల మధ్య సమానత్వం వుండాలి . 3.స్త్రీ పునరుత్పత్తి లో నిర్ణయాధికారం స్త్రీ     కి  వుండాలి . ప్రపంచీకరణ ,వ్యాపార ధోరణులు ప్రభావం తో స్త్రీ వాదం బలహీన పడింది .

 1969 నుండి దళిత సాహిత్యం ముందుకు వచ్చింది .పూలేఅంబేద్క ర్ ,మార్క్స్  ఆలోచనా ప్రభావంతో దళిత సాహిత్యం రూపు దిద్దుకుంది .నలుపు పత్రిక నదిచిన్ది.1970లో వికసించింది 1980లో ప్రవాహంగా రూపుదిద్దుకుంది . 1983లో రామారావు ప్రభుత్వం వచ్చింది . ఆకాలం లోనే వేంపెంట ,చుండూరు ,కారంచేడు  సంఘటనలతో దళిత సాహిత్యం ప్రబలంగా  వచ్చింది .  నాకు చరిత్ర లేదునాలుగు వేదాల్లోంచిపాదాఅలలొంచి నన్ను తొలగించారు అంటూ బోజ్జాతారకం రాసారు . నిజం చెప్పండి ,పంచముడంటే  వేలు లేని వాడ్నేనా అర్థం,మా ముత్తాత  ఏకలవ్యుడు చెప్పాడు అని ప్రశ్నించాడు సత్తీష్ చందర్ . 

మైనారిటి వాద సాహిత్యం పుట్టుమచ్చతో ప్రారంబమైనా గుజరాత్ లో మోడీ నాయకత్వం లో ముస్లిం ల పై పై జరిగిన అమానుష కాండ తరువాత గుజరాత్ గాయం వచ్చింది . జలజల ఆజా ,మొదలైన మైనారిటి  వాద సాహిత్యం ముందుకు వచ్చింది . నేను పుట్టక ముందే ,దేసద్రోహుల జాబితాలో నమోదైవుంది  నా పేరు  అంటూ ఆక్రోశం వ్యక్తం చేసాడు ఖాదర్ మొహిద్దీన్ . 


1990 తరువాత ప్రపచీకరణ ప్రారంబం అయ్యాక మనిషి మాయమై పోయాడు . 20 వ శతాబ్దంలో మనిషి మరనిస్తున్నాడని  ఫ్రామ్ అన్నాడు . వ్యకి వాదం,ఆసలుస్వార్థంవుద్యొగాకవశాలు సంపాదనలు ప్రదానమైనాయి . 

బషీర్బాగ్ లో విద్యుత్ చార్జీల  పెంపు పై ప్రజాపోరాటం పై ప్రభుత్వం జరిపిన మారణకాండ తో  కవులు రచయతలు మెల్కొన్నారు. వికసించిన విద్యుత్ తేజం కవితా సంకలనం వచ్చింది . వ్యక్తులుగా విడిపోయిన సాహిత్యకారులను ఒక్క్కటి చేసేందుకు సాహితీ స్రవంతి ఏర్పడింది . ప్రపంచీకరణ మతోన్మాదం ఉగ్రవాదం లకు వ్యతిరేకంగా కలిసి వచ్చే సాహిత్యకారులందరిని ఒకవిశాలవెదిక మీదకు తెచ్చేందుకు సాహితీ స్రవంతి కృషిచేయడం ప్రారంబించింది . 2001 లో ఏర్పడిని ఈ సంస్త సాహిత్య ప్రస్తానం పత్రికను  తప్పకుండా ప్రచురిస్తోంది . నూతన సాహిత్యకారులకు ప్రోత్సాహానిస్తోంది . సాహితీ  యవనికపై చెరగని ముద్రను ముద్రను వేస్తోంది .

 

రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు గారు మాట్లాడుతూ రాయలసీమ లో వేమన బ్రహ్మంగారు,అన్నమయ్య ప్రసిద్ద్దకవులని పేర్కొన్నారు . రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం  వామపక్ష రాజకీయాలకు పెట్టింది పేరని చెప్పారు. 

తరిమెల నాగిరెడ్డి ,నీలం రాజశేఖర రెడ్డి,రవూఫ్ మొదలైన వారంతా  వామపక్షరాజకీయాలను పెంపొందించా రని  ఆయన అన్నారు . నేటి రచయతలు సింగమనేని రాచపాలెం మొదలైన వారంతా మార్క్సిస్టు దృక్పథం తో రాస్తున్న రచయతలని వారి మధ్య మీరు వుండటం అదృష్టమని ఆయన అన్నారు . కథ కవిత్వం పై సాహిత్య సాల నిర్వహించడం యువరచయతలకు చాల ప్రోత్సాహ కరంగా ఉంటుందని ఆయన అన్నారు . 


కథా రచయిత్రి శశికళ గారు కొన్ని కథ లను చెప్పి కథలెలా రాస్తారో వుదహరించారు. చిన్నపిల్లల  కథలు కొన్ని వినిపించి పిల్లలకు వుత్సాహాన్ని కలిగించారు .

బండి నారాయణ స్వామి  తన చావుకూడు కథను చెప్పాడు . కథలో సంఘటలన్నీ ఒక చోట నుంచీ తీసుకోలేదని వేరు వేరు ప్రాంతాలలో జరిగిన వాటిని కలిపి ఒక కథగా రాసానని అయన వివరించారు . కథలెలా రాస్తారు అన్న ఒక వ్యాసం నకళ్ళ ను  కొన్నింటిని తెచ్చి అందరికి పంచారు . 

                   భోజనాంతరం కవిత్వం పై సాహిత్యశాల నిర్వహించారు 

    కథావస్తువును ఎలా గుర్తించాలో ప్రముఖ కవి రాధేయ గారు వివరించారు . చేనేత కార్మికుల వ్యధ లైనా,రైతుల ఆత్మహత్యలైనా విద్యార్ధి విజయమైనా మహిళల ఆక్రందనైనా కవిత్వంలో ఒదిగించవచ్చని చెప్పారు .మన చుట్టూ వున్న సమాజమే మనకు కవితా వస్తువును అందిస్తుందని ఆయన అన్నారు. రాసిన కవితను పలు మార్లు దిద్దుకోవాలని ఆయన చెప్పారు . కవిత్వం బాగా రాయాలంటే మంచి  కవితా  పుస్తకాలను బాగా చదవాలని ఆయన కొరారు. 


కవితా శిల్పాన్నిగురించ ప్రముఖ కవి మల్లెల నరసింహమూర్తి గారు చక్కగా వివరించారు . నల్ల ద్రాక్షపందిరి లోని కవితలను ఆయన వుదహరించి  ఎలా తీర్చి దిద్దాలో ఆయన వివరించారు . ఘూర్కా  శిఖామణి రాసిన కవితను ఉదహరిస్తూ సిల్పనిర్మానం ఎలాచేయాలో వివరించారు . మన చుటూ వున్నా విషయాలను మనం గమనించి వాటిని పద చిత్రాలలోనూ భావ చిత్రాలలోనూ రాయాలని ఆయన చెప్పారు . ఎలా చెప్పితే  పాటకునికి హత్తుకుంటుందో అదే  శిల్పమని ఆయన చెప్పినారు . శిల్పము ,వస్తువు కవిత్వానికి రెండు రథ చక్రాలాంటివని అన్నారు . కవిత్వం కావాలి కవిత్వం లేదంటే వచనమై తేలిపోతావ్ అని అంటాడు త్రిపురనేని శ్రీనివాస్ . శిల్పం మెరుగు పరుచుకోవాలంటే కవిత్వం ఒక శ్వాసగా ధ్యాసగా చదవాలి అని ఆయన ఆన్నారు . 

 

 

 

 


Friday, August 21, 2020

మానవతా సామాజిక సంస్కార దీపిక సాహితీ స్రవంతి


సాహితీ స్రవంతి ప్రజలకు సాంస్కృతిక కర్తవ్యాలను గ్రహించేలా చేయటానికి గత పదహైదు
ఏళ్ళుగా సముచితమైన కృషి చేస్తున్నది, సాహిత్య సంఘంలో పాఠకులను సంస్కార వంతులుగా
చేయటానికి కవిత్వం, కథ, నవల, విమర్శ లాంటి ప్రక్రియలలో నిజాయితీ, చిత్త శుద్ధితో పరిశ్రమిస్తున్నది.
                __సింగమనేని నారాయణ, సాహితీవేత్త

సమకాలీన సామాజిక అవగాహనల దొంతి సాహితీ స్రవంతి, భావి సాహితీవేత్తలను స్ఫూర్తిని పంచే విజ్ఞానజ్యోతి సాహితీ స్రవంతి, భవిష్యత్ తరానికి భద్రమైన అక్షర భవంతి సాహితీ స్రవంతి

                    ___ఏలూరి ఎంగన్న జనప్రియ కవి

సాహితీవేత్తలు, సాహిత్య పాఠకులు కలిసి ఉత్తమ సాహిత్యాన్ని దర్శించి విశ్లేషించుకునే
సాహిత్య కళాసౌందర్యవేదిక, సమున్నత మానవతా సామాజిక సంస్కార దీపిక సాహితీ స్రవంతి
                  ____మల్లెల నరసింహమూర్తి, అరసం

మతతత్వ ఫ్యూడల్ భావజాలాన్ని ధిక్కరిస్తూ సాహిత్య సాంస్కృతిక చైతన్యానికి శక్తివంచన
లేకుండా కృషి చేస్తున్న సంస్థ సాహితీ స్రవంతి
                                   __రాధేయ, సాహితీవేత్త

'సాహితీ స్రవంతి, సాహిత్య ప్రస్థానం (పత్రిక) జన కవనం (కవిసమ్మేళనం) ఇదొక త్రిపుటి.
ఈ త్రిపుటి సామాజిక పరివర్తన ఏకైక లక్ష్యంగా గురుతర బాధ్యత నిర్వహిస్తున్నది. వామపక్ష భావజాలం ప్రధాన తాత్వికతగా ఉంటూ, ప్రజాస్వభావం గలఇతర భావజాలాలను గౌరవిస్తూ, విశాల ప్రాతిపదిక మీద ఈ త్రిపుటి నిరంతరం శ్రమిస్తున్నది.
                    ___ డా॥రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి,
           కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత



వసంతం తరువాత మరో వసంతం

   
          ఒక సాహితీ సమాలోచన... ఒక ప్రస్థానం
వెయ్యి మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది...సాహిత్య కార్యక్రమాలను ఒంటరిగా చేయలేము. ఎంతో మంది సాహిత్యకారులు
కలవాలి. సాహిత్యాభిమానులు ఉండాలి. ఒక వసంతం దాటగానే మరో వసంతం వచ్చినట్లు ఒక సాహిత్య కార్యక్రమం చేయగానే మరో సాహిత్య కార్యక్రమం ముందుకు వస్తుంది. బాధ్యతగా ఉన్నప్పుడు సాహిత్యాన్ని ఉద్యమంగా చేస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా చేస్తాము. సాహితీ పరులకెప్పుడూ అలసట ఉండదు.‌సాహితీ మిత్రులను ఎప్పుడు ఆహ్వానించినా సభలో కూర్చొని సాహిత్యాన్ని ఆస్వాదిస్తారు.‌కార్యక్రమమంటేనే కాలాన్ని ఘనీభవింపజేయడం. ప్రసంగమంటేనే భావాలను
ఒకళ్ళ నుంచి మరొకళ్ళలోకి ప్రవహింపచేయడం. పదైదేళ్ళ సాహిత్య ప్రస్థానం గతానికి పొడిగింపే. గతమెంతో ఘనకీర్తి, లేకపోతే ఈ ప్రస్థానం సునాయసంగా సాగేది కాదు. ఎంతో మంది ప్రసిద్ధి సాహితీవేత్తలు - రాచపాళెం, సింగమనేని, శాంతి నారాయణ, రాధేయ, మల్లెల, రాజారాం ఇలా ఎంతో మంది జిల్లాలో వున్న సాహితీమూర్తులు సాహితీ స్రవంతికి చేదోడువాదోడుగా, వెన్నుదన్నుగా నిలబడ్డారు. సాహిత్య ప్రస్థానం పత్రికకు చందాదారులుగా, రచయితలుగా ఎంతోసహాయాన్ని సహకారాన్ని అందిస్తున్నారు.
       కొత్త గొంతుకను పరిచయం చేయటానికి నిరంతరం సాహితీస్రవంతి శ్రమిస్తోంది. పాతతరం సాహిత్యకారులను పరిచయం చేస్తూ కొత్త కలాలకు, గళాలకు ఊతమిస్తూ సాగుతోంది సాహితీ స్రవంతి. అనంతపురం జిల్లాలో సాహితీస్రవంతి ఇప్పటికే రెండు రచనలను 
    Anantha kavithaa swaraalu అనంత కవితా స్వరాలు

ప్రచురించింది. ఒకటి పిళ్ళా కుమార స్వామి రచించిన 'ప్రపంచీకరణపై పోటెత్తిన కవితా 
సముద్రం' రెండు 'అనంతకవితా స్వరాలు', ఇప్పుడు 'అనంత సాహితీసమాలోచన'. ఇంకా 
మరెన్నో రచనలు వర్థమాన సాహిత్యకారుల నుంచి రావాలి.అలా రావాలంటే ఈ సాహిత్య కృషి నిరంతరం కొనసాగాలి.
        జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నాము. జిల్లాలో సాహితీస్రవంతి పదహైదేండ్ల ప్రస్తానాన్ని అక్షరీకరించి పుస్తకరూపంలో మీ ముందుంచాము. దీనిని సాదరంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాము.
ఇదొక సంఘటిత స్వరం. అక్షరాల మాలిక, వ్యాస మంజరి, సాహితీ పూదోట. దీనిలోకి తొంగిచూసి ఒకరినొకరు కరచాలనం చేసుకొన్నప్పుడు ప్రతి స్వరంలోనూ మన హృదయస్పందనలు ఒకళ్ళ నుంచి మరొకళ్ళలోకి ప్రవహించేలా....
    ‌                   
                       పిళ్ళా కుమారస్వామి,
సాహితీస్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు

ప్రపంచీకరణలో దిశానిర్దేశం చేసిన సాహితీస్రవంతి





          

         1990 తరువాత సోషలిజం విచ్ఛిన్నంవల్ల చాలా మంది అభ్యుదయ రచయితల్లో, మార్క్సిస్టు రచయితల్లో భవిష్యత్తుపట్ల నిరాశనిస్పృహలు పెరిగాయి. కొంత మంది మాత్రమే భవిష్యత్తు పట్ల అచంచల విశ్వాసం ప్రకటించారు.ప్రపంచ వాణిజ్య సంస్థలో మనదేశ పాలకులు సంతకం పెట్టిరావడంతో ప్రపంచీకరణ ప్రారంభమైంది. నూతన ఆర్థిక విధానాలు పేరుతో ప్రైవేటీకరణ సరళీకరణ ప్రారంభమైంది. విదేశీ పెట్టుబడి ప్రబలంగా మన దేశంలోకి ప్రవహించింది.అదే సందర్భంలో విదేశీ వస్తువులు ఇబ్బడిముబ్బడిగా మనదేశంలోకి ప్రవహించ సాగాయి. పడమటిగాలి విపరీతంగా వీచింది. భాషా సంస్కృతుల్లో పెనుమార్పులు సంభవించి వాటి అస్థిత్వానికి పెనుప్రమాదం ఏర్పడింది. అభివృద్ధి పేరిటసామాజిక మూలాలు ధ్వంసం అయ్యాయి. మానవసంబంధాలు విచ్ఛిన్నం కాసాగాయి. ఏది గాయమో ఏది గేయమో అర్థంకాని గందరగోళ స్థితిలోసాహిత్యకారులున్నారు.
           చరిత్ర అంతమైందని జపాన్ తత్త్వవేత్త ఫుకుయామా ప్రకటించారు.అస్థిత్వవాదమే సరైనదేనే దృక్పథం పెరిగింది. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే,పెట్టుబడిదారి వర్గానికి ఊడిగంచేసే ఆధునికానంతరవాదం సాహిత్యంలోకి చొరబడింది. సమాజంలో వేలవేల చీలికలు వచ్చాయి. దళితుల్లో మాదిగదండోరా, మాలమహానాడు, బహుజనాల్లో తుడుందెబ్బ, చాకిరేవుదెబ్బ, వడ్డెర ... ఇలా ఎన్నో ఎన్నెన్నో సంఘాలు వచ్చాయి. ప్రపంచీకరణలో వ్యాపారీకరణ పెరిగి స్త్రీల అందాన్ని పెట్టుబడిగా మార్చారు. దీనితో స్త్రీవాదం పదును తగ్గిపోయింది. దళిత స్త్రీవాదులుస్త్రీవాద లక్ష్యాన్ని ప్రశ్నించసాగారు. సాహిత్యంలో కవులు, రచయితలు ప్రపంచీకరకణ వెల్లువలో కొట్టుకుపోసాగారు.    
           
        ఏది అభివృద్ధి ? ఏది వినాశనమో ? అర్థంకాని అయోమయంలో సాహిత్యకారులు ప్రపంచీకరణ చౌరాస్తాలో నిలబడ్డారు. బషీర్ బాగ్ 
లో ప్రభుత్వం ప్రజల పైన జరిపిన దారుణ దమణకాండ సాహిత్యకారులను కదిలించింది. అందరినీ ఒక్కటి చేసింది. ప్రపంచీకరణ, ప్రపంచ బ్యాంకుల వాస్తవ స్వరూపం సాక్షాత్కరించింది. ప్రపంచీకరణ ప్రతిఘటన మొదలైంది. 'వికసించిన విద్యుత్తేజం' కవితా సంకలనం వచ్చింది. అదే సందర్భంలో ప్రజలలో ఏర్పడిన నైరాశ్యాన్ని ఆసరాగా తీసుకొని
మతోన్మాద శక్తులు విజృంభించాయి. హిందూ, ముస్లిం మతోన్మాదం రెండూ పెరిగిపోయాయి. 'గతకాలము మేలు వచ్చు కాలముకంటెన్' అనే పరిస్థితి నెలకొంది. నోస్టాల్జియాలోకి సాహిత్యం వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో మతోన్మాదానికి, ప్రపంచీకరణకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసివచ్చే సాహిత్యకారులందరిని ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు 2001లో 'సాహితీ స్రవంతి' తన ప్రథమ సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో తెలకపల్లి రవి, వరప్రసాద్, లక్ష్మయ్యగార్లతో రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ ఏర్పడింది. దళిత, స్త్రీవాదులనుకలుపుకు పోవాలని నిర్ణయించింది.

          2002లో సాహితీస్రవంతి తన 'సాహిత్య ప్రస్థానం' పత్రికను సాహిత్య కారుల వేదికగా తీసుకువచ్చింది. ఇది త్రైమాసిక పత్రికగా మూడేళ్లు వచ్చింది. తరువాత మాసపత్రికగా నిరంతరాయంగా వస్తోంది. సాహితీ సృజన లోకంలో మంచికదలికను తీసుకువచ్చింది. ప్రగతిశీల సాహిత్యకారుల హృదయాల్లో మంచి సుస్థిర స్థానాన్ని సంపా దించింది. 2001 ముందు 

దర్పణం, గమనం, ప్రస్థానం,‌సాహిత్య సంచికలను తెలకపల్లిరవిగారి సంపాదకత్వాన ప్రజాశక్తి సాహితీసంస్థ తరపున అందించారు. ఈ ఒరవడిలో సాహిత్య ప్రస్థానం పత్రిక అన్ని వర్గాల సాహిత్య కారులకు ముఖ్యంగా కొత్తతరం సాహిత్య సృజన కారులకు మంచి వేదికైంది.

          2014లో  తెలంగాణా విడిపోవాలనే వాదన బలంగా పెరిగి అంతిమంగా విడిపోయింది. ఆ తరువాత రాయలసీమ అస్థిత్వవేదన ప్రారంభ మైంది.

      - పిళ్ళా విజయ్,9490122229

Thursday, August 20, 2020

సామాజిక పరివర్తనే ఏకైక లక్ష్యంగా

          
         'సాహితీ స్రవంతి' (సంస్థ) సాహిత్య ప్రస్థానం (పత్రిక) జన కవనం (కార్యక్రమం) ఇదొక త్రయం, లేదు త్రిపుటి. 

ఈ త్రిపుటి పుష్కర కాలంగా తెలుగు
సమాజంతో పెనవేసుకుపోయింది. 
సామాజిక పరివర్తన ఏకైక లక్ష్యంగా గురుతర బాధ్యత నిర్వహిస్తున్నది. తెలుగు సాహిత్య పునర్వికసనం పరమ లక్ష్యంగా కృషి చేస్తున్నది. వామపక్ష
భావజాలం ప్రధాన తాత్వికతగా ఉంటూ, ప్రజాస్వభావం గల ఇతర భావజాలాలను గౌరవిస్తూ, విశాల ప్రాతిపదిక మీద ఈ త్రిపుటి నిరంతరం శ్రమిస్తున్నది. సాహితీ స్రవంతి కార్యక్రమాలలో పాల్గొనడం, సాహిత్య ప్రస్థానంలో రచనలు ప్రచురణ కావడం, జనకవనంలో కవులుగా పాల్గొనడం, గౌరవంగా, మర్యాదగానే గాక, గొప్ప బాధ్యతగా సాహితీ పరులు భావిస్తుండడం నిజం. వర్తమాన సమాజ పరివర్తనకు అవసరమైన భావ ప్రచార
నిర్వహణలో ఈ త్రిపుటి పాత్ర తిరుగులేనిది, తిరస్కరించలేనది. ఈ త్రిపుటి ద్వారా ఎందరో ఔత్సాహికులు విమర్శకులుగా, రచయితలుగా వెలుగులోకి వచ్చారు. సామాజిక గౌరవం పొందారు.
        2002 నాటి బషీర్ బాగ్ దుర్ఘటనతో మొదలై రాష్ట్ర స్థాయిలోనూ,జిల్లాల స్థాయిలోనూ అనేక జనకవనం కార్యక్రమాలు జరిగాయి. ప్రతి జనకవనం అప్పటి సామాజిక పరిణామాలకు కళాత్మకమైన కైఫియత్ గా నమోదవుతున్నది.
          లబ్ధ ప్రతిష్ఠులైన కవుల నుండి ఔత్సాహికుల దాకా ఒకే వేదిక పైకి వచ్చి జనం గురించి తమ గళం విప్పడానికి సంకోచించని కార్యక్రమం జనకవనం. 

తెలకపల్లి రవి గారి నిబద్ధత, నిమగ్నతలు ఈ త్రిపుటిని ప్రజాపరం చేస్తున్నాయి. ఆనందాచారి,

వొరప్రసాద్ వంటి సహ సైనికుల ద్వారా ఉద్యమస్థాయిలో సాహిత్య చర్చలు,ప్రచురణలు, కార్యక్రమాల నిర్వహణ సాగుతున్నాయి. ఈ సైన్యంలో భాగస్వామి అనంతపురం జిల్లాలో పిళ్ళా కుమారస్వామి. 
  
           అనంతపురం జిల్లా సాహితీ స్రవంతిని బాధ్యతగా కుమారస్వామి గత పదహైదు ఏండ్లుగా ప్రతి సందర్భంలోనూ కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. ఇతర సాహితీ సంస్థలు స్తబ్ధంగా ఉన్న సమయంలో 

కుమారస్వామి తనదైన మార్గంలో సాహితీ స్రవంతిని ప్రవహింపజేస్తున్నారు. ఆయన కృషిలో భాగమే ఈ 'అనంతసాహితీ స్రవంతి'. అనంతపురం జిల్లా సాహితీ స్రవంతి సుదీర్గ ప్రయాణంలోఇదొక కేంద్ర బిందువు. ఈ దశకు చేరుకోవడానికి 'అనంత' రచయితల, కార్యకర్తల సహకారం మరువలేనిది.

     - (అనంత కవితాస్వరాలు కవితా సంకలనానికి
రాసిన ముందు మాట నుంచి)

  - డా॥ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి

Thursday, July 23, 2020

కరువుపై కరువులు,రచయితలు స్పందించాలి




సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్
"వరుస కరువులతో ఆనంతపురం జిల్లాలో ప్రజల జీవనం దుర్భరంగా మారింది. రైతు ఆత్మహత్యలు, ఉపాధి కోసం వలసలు కొనసాగుతున్నాయి. వీటిపై
కరువులు, రచయితలు స్పందించాల్సిన అవసరముంది". అని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ పిలుపునిచ్చారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కుమారస్వామి
ఆధ్యక్షతన ఆదివారం నాడు 'ప్రజాశక్తి కార్యాలయంలో సాహితీ సమయం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వి.రాంభూపాల్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయి
ప్రసంగించారు. వరుస కరువులతో అనంతపురం జిల్లాలో ప్రజల జీవనం అస్థవ్యస్థంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే
ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు సాగునీరు, తాగునీటి వసతి లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి లేక సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన
దుస్థితి ఏర్పడుతోందని వివరించారు. ఇటువంటి సమయంలో కవులు, రచయితలు జిల్లా పరిస్థితుల పై తమ కలాలకు పదును పెట్టాల్సిన అవసరముందని
పిలుపునిచ్చారు. తమ కవితలు, రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడమే కాకుండా ప్రభుత్వాల తీరును , విధంగా ఉండాలని సూచించారు. దీనికి సాహితీ
స్రవంతి సభ్యులు స్పందిస్తూ కష్టాల్లోనున్న ప్రజల తరుపున తాము నిలబడేందుకు ఎప్పుడూ సిద్ధమేనని చెప్పారు. రైతులు, వ్యవసాయ కూలీల తరుపున నిలబడి రచనలు
సాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పెట్టి జయరాం, సురేష్, గంగాదేవి, బాలభారతమ్మ, సూర్యనారాయణరెడ్డి, నవీన్ కుమార్, చంద్రశేఖర్,
సుజాత, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Saturday, June 27, 2020

అనంతపురంలో కార్మిక సాహిత్యంపై సదస్సు



       

          సాహిత్య అకాడమీ, సాహితీస్రవంతి కలిసి కార్మిక
సాహిత్యంపై ఒక రోజు సదస్సును అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో 15-12-2016 ఆదివారం నాడు ఒక రోజంతా   సదస్సు నిర్వహించాయి.
            ప్రారంభ సమావేశానికి సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు పిళ్లా కుమారస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, ప్రముఖ సాహితీవేత్త తెలకపల్లిరవి విచ్చేశారు.  సింగమనేని నారాయణ (కార్మికకథలు). మేడిపల్లి రవికుమార్ (కార్మికకవిత్వం) శ్రీమతి సంజీవమ్మ (కార్మిక నవలలు), శాంతారావు (కార్మిక నాటకాలు)  వారికి కేటాయించిన అంశాలపై ప్రసంగించారు.  సాహితీ స్రవంతి జిల్లా ప్రధానకార్యదర్శి వల్లెపు రవిచంద్ర ఆహ్వానం పలికారు.
               అధ్యక్షత వహించిన పిల్లా కుమారస్వామి  మాట్లాడుతూ కార్మికుల సాహిత్యం మొత్తం సాహిత్యంలో చూస్తే చాలా తక్కువగా ఉందని ఆ లోటును పూడ్చడానికి సాహిత్యకారులు కార్మికుల సంబంధించి విరివిగా రచనలు చేయాలని కోరారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, జీవనపోరాటాల గురించి సాహిత్యంలోకి తీసుకురావాల్సిన అవసరం గురించి తెలిపారు. అస్థిత్వవాదాలపై చర్చ జరిగినంతగా కార్మిక సాహిత్యం పై జరగలేదన్నారు. కార్మిక సాహిత్యం పై చర్చ జరిగితే ఆస్థిత్వవాదాలు వెనుకబడు తాయని ఆయన చెప్పారు.
             గురజాడ కన్యాశుల్కంలో ప్రస్తావన కొచ్చిన శ్రమ గురించి అంశాల వారీగా వివరించారు రాచపాళెం గారు.
తెలకపల్లి రవి గారు ప్రసంగిస్తూ శ్రమ అనేది సాహిత్యంలో ఎంత వరకు ప్రతిఫలించిందని పరిశీలిస్తే రాజుల కాలంలో రాజులకు సంబంధించిన అంశాలు తప్ప శ్రమజీవుల గురించి ఏమాత్రం కనిపిందన్నారు.భక్తి సాహిత్యంలో అక్కడక్కడ తమకు తెలియకుండానే శ్రమజీవుల గురించి రాశారన్నారు. పోతన రాసిన భాగవతంలో కొన్ని ఉదాహరణలు వివరించారు. సోవియట్ రష్యాలో కార్మికుల రాజ్యం ఆవిర్భవించాక శ్రామికుల గురించి సాహిత్యంలోకి ప్రవేశించిందన్నారు. 1922లో మాలపల్లి నవలలు, 1934,35లో వచ్చిన అమ్మ నవల అనువాదం ద్వారా, 1934లో శ్రీశ్రీ రచనలు ద్వారా శ్రామిక సాహిత్యం తెలుగులోనికి వచ్చిందన్నారు.

           రెండో సెషన్లో   సాహితీస్రవంతి జిల్లా అధ్యక్షులు ప్రగతి అధ్యక్షత వహించారు.కార్మికుల కథల పై  సింగమనేని నారాయణ మాట్లాడుతూ సాహిత్యాన్ని శ్రామికకోణం నుంచి
చూడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. . మార్క్స్ భావజాలం మూలంగానే శ్రామిక దృక్పథం చాలా మందిలో ఏర్పడింది.
కె.సభా రాసిన కథల్లో ఎక్కువ భాగం వ్యవసాయ కార్మికుల గురించే ఉందన్నారు. మధురాంతకం రాజారాం
శ్రమజీవులకు సంబంధించిన అనేక కథలు రాశారు. తెలంగాణా ప్రాంతం నుంచి చేనేత కార్మికులు, వృత్తిదారుల కథలు విరివిగా వచ్చాయన్నారు. కల్లుగీత, వడ్రంగి, కమ్మరి, కుమ్మరుల కథావస్తువులు వచ్చాయన్నారు. మధురాంతకం
నరేంద్ర భవన నిర్మాణ కార్మికుల గురించి కథలు రాశారన్నారు. శ్రమకు గౌరవం ఇవ్వగలిగిన సాహిత్యం శ్రామిక
సాహిత్యమన్నారు. ప్రపంచం శ్రమమూలంగానే నడుస్తున్నదని చెప్పినవాడు మార్క్స్ .మానవ చరిత్ర నిర్మాతలు శ్రామికులే నన్నారు.

          కార్మిక నాటక సాహిత్యం సెషన్‌కు ప్రముఖ నాటక రచయిత యక్కలూరి శ్రీరాములు అధ్యక్షత వహించారు. ప్రధానవక్త శాంతారావు కార్మిక నాటక సాహిత్యంపై ప్రసంగించారు. శ్రమసాహిత్యం గురించి మాట్లాడాలంటే
మొదట వేమన నుంచి చెప్పుకోవాలన్నారు. శ్రీశ్రీ నుంచి మాట్లాడుకోవాలన్నారు. శ్రామికులకు సంబంధించి మా భూమి,
ముందడుగు నాటకాలు వచ్చాయన్నారు. రక్తకన్నీరు. జగన్నాథ రథ చక్రాలు వంటి నాటకాలు ప్రజలను కదలించాయి.
సప్దర్ హష్మి నాటకం పూర్తిగా వీధినాటకం. ప్రజల మధ్యన ఉంటూ ఎలాంటి స్టేజి లేకుండా వేసే నాటకం వీధి నాటకం.
కళాజాతలు జరిగినప్పుడు నాటకాలు వేస్తే జనం నాటకంలో పాత్రలతో కలసిపోయేవారు. 'కార్మికులారా ఏకం కండి'
అంటే ప్రజలు కూడా ఏకంకండి' అనే నినాదాలు ఇచ్చేవారు. ప్రపంచీకరణతో జీవితం సంక్షోభ భరితం అవుతున్న వేళ
ప్రజలకు ఆశను,  ధైర్యాన్ని ఇచ్చే నాటకం రావాలి. మీడియాను వదలి ప్రజలు నాటకాలు చూసే దశ రావాలంటే కొత్తగా
రాయాలి. భార్య చనిపోతే మోసుకుపోయే పరిస్థితి గిరిజన ప్రాంతాల్లో ఉంది. ఇలాంటి అమానవీయ దృత్యాలపై ప్రజలు
స్పందించే విధంగా మనం నాటకాలు రాయాలి, వేయాలి.
ప్రముఖకవి ఏలూరి ఎంగన్న దానికి స్పందనగా కొన్ని నాటకాల గురించి వివరించారు. పాలేరు, నంది, ముఠామేస్త్రీ
పంటి నాటకాలు శ్రామికుల గురించి రాసినవన్నారు. వాటిని ప్రదర్శించినప్పుడు ప్రజలు బాగా స్పందించారన్నారు.
              భోజనానంతరం జరిగిన కార్మిక కవిత్వం సెషనుకు  కవి నాగేంద్ర అధ్యక్షత వహించారు.డా|| మేడిపల్లి రవికుమార్, కార్మిక కవిత్వంపై ప్రసంగించారు. నన్నయ కాలం నుంచి తెలుగు సాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్ల అంతకు ముందున్న సాహిత్యం మరుగునపడి పోయిందన్నారు. నన్నయకు ముందు విశేషమైన జూనపద సాహిత్యం ఉంది. అందులో శ్రామికుల గీతాలే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి ఆ గేయాలను కవిత్వాలుగా శ్రామికులే పాడారు.  వారి సమిష్టి సంపద అది. శ్రామిక కవిత్వం పై పెద్దగా పరిశోధన లేదు. కేవలం దళితవాదం, స్త్రీవాదం బహుజనవాదం పై జరిగిన పరిశోధన శ్రామికుల కవిత్వంపై పెద్ద చర్చ జరగలేదు. దీనిని విశ్వ విద్యాలయాలు పట్టించుకోవాలన్నారు.
             కార్మిక నవలా సాహిత్యం'పై సభ కొనసాగింది. ఈ సభకు ప్రముఖ కథారచయిత్రి శశికళ అధ్యక్షత వహించారు. ప్రధానవక్త డా॥ సంజీవమ్మ గారు హాజరయ్యారు. ఆమె అక్కినేని కుటుంబరావు రచించిన 'కార్మికగీతం' నవలపై, శిరంశెట్టి కాంతారావు రచించిన 'వ్యూహం' నవలలపై కూలంకుషంగా చర్చించారు. ఇవి రెండూ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ప్రధాన నవలలు.కార్మిక సాహిత్యం సంబంధించిన నవలలు తక్కువగా ఉన్నాయన్నారు. కార్మికగీతం 'సిటు' (సి.ఐ. టి.యు.) సంస్థ ప్రచురించిందని చెప్పారు. దీనిలో కార్మికులు పడే బాధలు, వాటి నుండి బయటపడటానికియాజమాన్యంతో చేసే పోరాటాలు, చట్టాలు మొదలైనవి ఉన్నాయన్నారు. వ్యూహం నవల చదివితే కార్మికులు ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడు తున్నారా? అని బాధ కలుగుతుందన్నారు. నవల ప్రారంభమే ఒక భీభత్స దృశ్యంతో ప్రారంభమవుతుంది. కార్మికుడు నిర్మాణంలో వున్న ఏడు అంతస్థుల టవర్ పై పనిచేస్తూ పై నుంచి జారి కిందకు పడుతూ కడ్డీలపై బడి దాన్లో ఇరుక్కొని చనిపోయే సంఘటనతో నవల ప్రారంభమువుతంది. ఆ కార్మికునికి నష్టపరిహారమిప్పడానికి యాజమాన్యం ఒప్పుకోదు. సంఘాలు ప్రవేశిస్తాయి. కొన్ని సంఘాలుగా నటిస్తూ కార్మికులకు ద్రోహం చేస్తుంటాయి. ఒక సంఘం నికరంగా నిలబడి ఆ కార్మికుడి కుటుంబానికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పిస్తారు. ఇలా సాగుతుంది నవల అని చెప్పారు. ఈ నవలలో యజమానుల వ్యూహాలు ఎత్తగడలు తెలుస్తాయన్నారు.
            జనరల్ కార్మిక సాహిత్యంపై ప్రఖ్యాత కథ, నవలా రచయిత, కవి, నాటక రచయిత, పాటల రచయిత అయిన తెలకపల్లి రవి కార్మికవర్గ సాహిత్యం గురించి సోదాహరణంగా చెప్పారు. మార్క్సిస్టు అయితేనే కార్మికుల గురించి రాయ గలడని చెప్పడం అంత సవ్యంగా లేదన్నారు. మార్క్సిజం తెలియకపోయిన, మార్క్సిస్టు కాకపోయిన వారుకూడా, శ్రామిక సాహిత్యం రాశారన్నారు. వివిధ అస్థిత్వ వాదాలు చర్చల్లో వున్నా కూడా శ్రామిక సాహిత్యం గురించి చర్చలేదన్నారు. విశ్వవిద్యాయాలు విద్యార్థులచే ఈ దిశగా పరిశోధనలు చేయించటం అవసరమన్నారు. కార్మిక సాహిత్యం రూపొందించ డానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సాహిత్య అకాడమీ ఇలాంటి వారికి చేయూతనివ్వదం ఎంతో గొప్ప విషయమన్నారు.
           పిళ్లా కుమారస్వామి వందన సమర్పణతో లిటరరీ ఫోరమ్ కార్యక్రమం ముగిసింది.

Friday, June 19, 2020

2017

2/2017
సమాజదుర్లక్షణాలను కవులు ప్రశ్నించాలి.~~~ చంద్రశేఖరశాస్త్రి





సాహితీస్రవంతి ఆద్వర్యంలో స్తానిక యమ్ ఆర్ సి భవనం లో అదినారాయణరెడ్డి అధ్యక్ష తన జరిగిన ఇపుడు వీస్తున్నగాలి కార్యక్రమం లో ముక్య అథితిగా చంద్రశేఖరశాస్త్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కవులు సమాజంలో ప్రజలకు జరుగుతున్న  అన్యాయాలను తమ కవిత్వం ద్వారా ప్రస్నించాలని ప్రజలకు ప్రశ్నించే శక్తిని ఇవ్వాలని కోరారు.
కవులు కవిత్వం ద్వారా కష్టజీవులకు కుడిఎడమల నిలబడాలని ఆయన కోరారు.
చంద్రశేఖర శాస్త్రిగారు రచించిన కత్తులవంతెన కవితా సంపుటిపై సాహితీస్రవంతి రాష్త్ర సభ్యుడు పిల్లా కుమారస్వామి రెడ్డి సమీక్ష చేస్తూ కవి సమాజాన్ని బాగా అధ్యయనం చేశాడన్నారు.రైతుల ఆత్మహత్యలన్ని రాజ్యం చేస్తున్న హత్యలని కవి చెప్పడం కవి ఎవరి పక్షమో తెలుస్తోందన్నారు.కవిత్వం కష్టజీవి కన్నీరు తుడిచే ఓ చల్లని హస్తం కావాలని ఆయన కోరాడన్నారు.తరువాత సాహితీస్రవంతి పట్టణ అధ్యక్షుడు చెన్నక్రిష్న మాట్లాడుతూ చంద్రశేఖరశాస్త్రి సమకాలీన జీవితాన్ని తన కవిత్వంలో వ్యక్తీరించాడన్నారు.సాహితీస్రవంతి ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ చం ప్రజాకవి అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో ధర్మవరం నుండి వచ్చిన సాహితీవేత్త షమీవుల్లా అనంతపురం నుండి  వచ్చిన అంకె శ్రీనివాస్ కవులు శంకరనారాయణరాజు సుందరమోహన రెడ్డి లెక్చరర్ కవిత గారు ఓబులపతి అబ్దుల్ఖఖాన్ తదితరులు పాల్గొన్నారు.

30.4.2017 న వేమన సాహిత్యం పై రాష్ట్ర సదస్సు నిర్వహించాను.









సాహిత్య అకాడమీ, సాహితీ స్రవంతి సంయుక్తంగా
కార్మిక సాహిత్యంపై అనంతపురంలో ప్రెస్‌క్లబ్‌లో డిసెంబర్‌,2017,
15న ఒకరోజు సదస్సు నిర్వహించాయి.




ప్రారంభ సమావేశానికి సాహితీసప్రవంతి రాష్ట్ర కమిటి
సభ్యులు పిళ్లా కుమారస్వామి అధ్యక్షత వహించారు. ముఖ్య
అతిథులుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (గ్రహీత
రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, సాహిత్య ప్రస్థానం ప్రధాన
సంపాదకులు తెలకపల్లి రవి విచ్చేశారు. ప్రసంగకర్తలు
సింగమనేని నారాయణ (కార్మికకథలు), మేడిపల్లి రవికుమార్‌
(కార్మికకవిత్వం) శ్రీమతి సంజీవమ్మ (కార్మిక నవలలు),
శాంతారావు (కార్మిక నాటకాలు) వేదిక నలంకరించారు.
వీరందరిని వేదికపైకి సాహితీప్రవంతి జిల్లా ప్రధానకార్యదర్శి
వల్లెపు రవిచంద్ర ఆహ్వానించారు.

అధ్యక్షత వహించిన పిళ్లా కుమారస్వామి ఆ రోజు
జరిగే కార్యక్రమాన్ని సభికులకు వివరించారు. ప్రధానంగా
కార్మికుల సాహిత్యం చాలా తక్కువగా ఉందని ఆ లోటును
పూడ్చడానికి సాహిత్యకారులు కార్మికులకు సంబంధించి
విరివిగా రచనలు చేయాలని కోరారు. కార్మికులు
ఎదుర్కొంటున్న సమస్యలు సాహిత్యంలోకి తీసుకురావాల్సిన
అవసరం గురించి తెలిపారు. అస్తిత్వవాదాలపై చర్చ
జరిగినంతగా కార్మిక సాహిత్యంపై జరగలేదన్నారు. కార్మికసాహిత్యంపై చర్చ జరిగితే అస్తిత్వవాదాలు వెనుకబడుతాయని
ఆయన చెప్పారు.

వివిధ అంశాలపై నిరంతరం
సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుందని రాచపాళెం
చంద్రశేఖరరెడ్డి వివరించారు. గురజాడ కన్యాశుల్కంలో శ్రమ
గురించి అంశాల వారీగా వివరించారు.
కార్మిక నాటక సాహిత్యంపై ప్రసంగించారు. శ్రమసాహిత్యం
గురించి మాట్లాడాలంటే మొదట వేమన గురించి
'చెప్పుకోవాలన్నారు. శ్రీశ్రీ నుంచి మాట్లాడుకోవాలన్నారు.
శ్రామికులకు సంబంధించి మా భూమి, ముందడుగు
నాటకాలు వచ్చాయన్నారు. రక్తకన్నీరు, జగన్హాథరథ చక్రాలు
వంటి నాటకాలు ప్రజలను కదిలించాయని, సప్టర్‌ హష్మి
నాటకం పూర్తిగా వీధినాటకమని, ప్రజల మధ్యన ఉంటూఎలాంటి స్టేజి లేకుండా వేసే నాటకం వీధినాటకమని
తెలిపారు. కళాజాతాలు జరిగినపుడు నాటకాలు వేస్తే జనంనాటకంలో పాత్రలతో కలసిపోయేవారని, ప్రపంచీకరణతో
జీవితం సంక్షోభ భరితం అవుతున్న వేళ ప్రజలకు ఆత్మస్థైర్యాన్ని
ఇచ్చే నాటకం రావాలన్నారు.

ప్రముఖ కవి ఏలూరి ఎంగన్న స్పందనగా కొన్ని
నాటకాల గురించి వివరించారు. 'పాలేరు, నంది, ముఠామేస్త్రీ"
వంటి నాటకాలు (శ్రామికుల గురించి రాసినవన్నారు. వాటిని
ప్రదర్శించినపుడు ప్రజలు బాగా స్పందించారన్నారు.

మధ్యాహ్నం భోజనానంతరం జరిగిన కార్మిక కవిత్వం'సెషనుకు వర్ధమాన కవి నాగేంద్ర అధ్యక్షత వహించారు.'డా॥ మేడిపల్లి రవికుమార్‌, నన్నయ కాలం నుంచి తెలుగుసాహిత్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్ల అంతకుముందున్న సాహిత్యం మరుగునపడి పోయిందన్నారు.
నన్నయకు ముందు విశేషమైన జానపద సాహిత్యం ఉందనీ,అందులో శ్రామికుల గీతాలే ఎక్కువగా ఉన్నా వాస్తవానికి ఆగేయాలను కవిత్వాలుగా శ్రామికులే పాడేవారని, వారే కర్తలు,
వార్లకు పేర్లు లేవని, అవి వారి సమిష్టి సంపద అన్నారు.
శ్రామిక కవిత్వంపై పెద్దగా పరిశోధన జరగలేదన్నారు.విశ్వవిద్యాలయాలు పట్టించుకోవాలన్నారు.

తదనంతరం “కార్మిక నవలా సాహిత్యం" పై సభ
కొనసాగింది. ఈ సభకు ప్రముఖకథారచయిత్రి “శశికళా అధ్యక్షతవహించారు. వ్రధానవక్త డా!సంజీవమ్మ హాజరయ్యారు. ఆమె అక్కినేని  కుటుంబరావు రచించినకార్మిక గీతం” శిరంశెట్టి కాంతారావురచించిన “వ్యూహం” పై ప్రసంగించారు.

LITERARY FORUM ON "AGRARIAN NOVELS IN TELUGU LITERATURE“ PROGRAMME REPORT
To
SP Mahalingeswar,
Regional Secretary,
Sahiti Academy,
RO Bangalore.
Sahitya Academy Benguluru & Sahiti Sravanti jointly conducted Literary forum on
"Agrarian novels in telugu literature" at S.V.U. Arts Block Auditorium Tirupati, on 4 September
2017. Two hundred spectators were participated in this programme. Telugu lit students,
Scholars, lectures, writers, farmers and cultural artists were also participated. The program
started 10 o'clock and closed 2 o'clock
Sahiti Sravanti, Tirupati, convener O.Venkataramana introduced the literary forum
program and invited Guests & participants. Popular Telugu Literature Critic, Writer, Professor
Medipali Ravi Kumar presided the meeting. He spoke that most of the Agrarian Novels were
written by the Rayalaseema writers. Farmers' happiness is only nation's strength. Chief Guest
S.V.U. Arts College principal Professor Savaraiah gave most valuable information about downfall
in agricultural economy since two decades. He added that globalization destroyed the
agriculture hence lackhs of farmers commited suicide
Professor N. Munirathanamma presented Lankipalli Kannaiah Naidu's novel "PACHAGA
NOORELLU. She admired and explained family relationships at village & the effects of drought
on the farmer's family and farmer's affection on land.
Professor S. Rajeswari presented Sannapa Reddy Venkatarami Reddy's navel "OKKA
VAANA CHALU". She categorically described them and characterized the economic situation of
village culture. Farmer migrates to city leaving his land due to heavy drought. Then farmerbecomes labour. He returned to village soon after rain comes. She also quoted the attitude of humanity, affection towards crap, whereas corporate capitalists selfishness Professor R. Rajeswaramma presented Sunkoji Devendra Chari's "VAANA NELA NEERU"She described novel in all aspects. Chittoor district farmers depend on bore wells, spending lakhs of rupees to dig. As ground waters are nil, farmer commits suicide. His wife confidentlyenters into agriculture. She struggled against hardies. Even the debts raised double, but she continues the cultivation confidently Writer and critic Sri Piilaa Kumara Swami, presented Palamaneru Balaji's "NELA NAVVINDI. He explained novel in historical aspect where the Government prestigiously brought an Israeli Company to introduce new way of farming at Kuppam. The company took lands from farmers and they promised them to pay Rs. 30,000/Acre after crop. But they paid only Rs.5,000/-, Land fertility induced, farmers ruined and migrated to Bengaluru.Praja Natya Mandali artists Jagananna, Venu, Suhasini, Palani, Subbu sang Rythula Paatalu (Farmers' songs) Sunkoji Devendra Chari, Lankipalli Kannalah Naicu, MadurantakaNarendra, Shanmugam and Sakam Nagaraju were attended. Vote of thanks addressed byresearch scholar Adi Seshaiah.

Yours faithfully,

(CONVENOR, SAHITI SRAVANTHI)
O, VENKATA RAMANA
14-638, Panchali Nagar, Renigunta,
Chittoor Dist. A.P. -517 520.
Contact: +91-9494512930
E-mail: ovramana 1961@gmail.com
CS Scanned with CamScanner