Thursday, August 27, 2020

2016 లో అనంతపురం లో సాహిత్యశాల

            17.4.2016 న అనంతపురంలో సాహిత్యశాల కార్యక్రమానికి పర్యవేక్షకులుగా వై   సూర్యనారా యణ రెడ్డి  (నగర అధ్యక్షులు) ,ప్రజ్ఞా సురేష్ ఆచార్యులుగా  వ్యవహరించారు . ముఖ్య అతిధి గా సింగమనేని నారాయణ ,ఆత్మీయ  అతిధి గా జంధ్యాల రఘుబాబు ,ప్రారంభ  భోధకునిగా పిళ్ళా కుమారస్వామి పాల్గొన్నారు .సింగమనేని నారాయణ గారు   రాయలసీమ కథాచిత్రము గురించి ప్రసంగించారు. కథలు వ్రాసేవారు ముందుగా ప్రసిద్ధ కథలను చదవాలన్నారు. ముఖ్యంగా మార్క్సిస్టు దృక్పథాన్ని అలవరుచుకొవాలాన్నరు. ప్రతి విషయాన్ని చారిత్రిక  గమనం లో చూడాలన్నారు . మార్క్సిజమంటే చాలామంది భయపడుతుంటారని అది సరియైనది కాదని ఆయన అన్నారు .కథ మొట్టమొదట కోస్తా ప్రాంతంలో ప్రారంబమైందని దీనికి కారణం అక్కడ నీళ్ళు వుండటం ,నాగరికత అభివృద్ధి చెందటం గా  చూడవచ్చని ఆయన అన్నారు. నీళ్ళు లేని రాయలసీమలో కత చాలా  ఆలస్యంగా మొదలైనదన్నారు. మార్క్సిస్టు ఆలోచన విధానం తో మొట్టమొదట రాసిన వారు కడపజిల్లా వారని  వారిలో ముఖ్యులు రాచమల్లు రామచంద్రారెడ్డి ,కేతు  విశ్వనాథరెడ్డి ,సొదుం జయరాం ,రామకృష్ణారెడ్డి మదలైన వారున్నారనిఆయన     పేర్కొన్న్నారుసామాజిక చారిత్రిక దృక్పథముతో చూడకుండా సాహిత్యాన్ని అధ్యనం చేయలేమని సింగమనేని అన్న్నారు. ప్రగతిశీల దృక్పథం వున్నవే చరిత్రలో నిలుస్తాయన్నారు .పాలకవర్గ భావాలే ప్రజల భావాలుగా వుంటా యన్నారు. కథలో వస్తువును ఇతివృత్తం అంటారు. రాసేవిదానాన్ని రూపం అంటారు .  భావజాలాన్ని దృక్పథం అంటారు . సమాజ పరిణామంతో  సంబందం లేకుండా  చూస్తె   అర్థం కాదన్నారు. 

 


కుమారస్వామి  తరువాత సాహిత్య  పరిణామక్రమాన్నివివరించారు . 18వ శతాబ్దంలో యూరప్ లో వచ్చిన పారశ్రామిక విప్లవం ఫలితంగా అక్కడ రొమాంటిసిజం వచ్చింది . దానిప్రభావం మనదేశం లో 20వ శతాబ్దం లో వచ్చింది . బ్రిటిష్  ఆంగ్లవిద్యని  ప్రవేశ పెట్టడం వల్ల  భారతీయుల భావజాలం లో మార్పు వచ్చింది . రాజరామమోహనరాయ్ బ్రహ్మసమాజాన్న్ని సాపించడం వలన సతీ సహగమనం పై పోరాడటం మూలంగా దాని ప్రభావం ఆంధ్రదేశం పై పడింది . అందువల్ల ఇక్కడ భావకవిత్వం వచ్చింది .నండూరి సుబ్బారావు ,కృష్ణశాస్త్రి ,మొదలైన వారంతా భావకవిత్వం లో  మునిగిపోయారు . స్త్రీ పురుషులమధ్య కామసంబంద భావాలు లేకుండా స్నేహ సంబంధ భావాలు  వుండటం భావకవిత్వ లక్షణం . 1920 నాటికి గాంధీ  జాతీయోద్యమ ప్రభావం వలన మాలపల్లి నవలను  వున్నవలక్ష్మినారాయణ రాశారు .గురజాడ ఆధునిక కథానిక దిద్దుబాటు వచ్చింది . అప్పటికే కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణం అనే కావ్వ్యాన్ని  రాశారు . దీన్ని ఆధునిక కవిత్వానికి వేగుచుక్కగా భావిస్తారు .భావకవిత్వం పోయి  జాతీయోద్యమకవిత్వం ప్రారంభమైంది . 1930 నాటికి ప్రపంచంలో ఆర్ధిక సంక్షోభంవచ్చింది . ఫలి తంగా బ్రిటన్ లో లెఫ్ట్ వింగర్స్ తమ న్యూ  సిగ్నేచర్స్ అనే కవితా సంకలనాన్ని రాశా రు . 1930 లో ఇటలీలో ముస్సోలినీ ,జర్మనీలో  హిట్లర్ ల ఫాసిజం విజయవంతం అయింది .  1935 లోఫాసిజానికి  వ్యతిరేకంగా పారిస్ లో రోమారోలా ,వేల్స్ ,థామస్ మాన్ మాక్సింగోర్కీ మొదలైన రచయతలు సమావేశమై ఒక మహాసభ జరిపారు. అందులో భారత దేశం నుండి సజ్జాద్ జహీద్ ,ముల్కరాజ్ ఆనంద్ ,జె సింఘీష్ ,ప్రమోద్సేన్ గుప్తా వంటి వాళ్ళు పాల్గొన్నారు. ఆతరువాత  మన దేశం లో 1936లో ప్రేమ్చంద్ అధ్యక్షతన అభ్యుదయ రచయతల మహాసభ జరిగింది . ఈ సభ కు మన ఆంధ్రదేశం నుండి అబ్బూరి రామకృష్ణారావు  హాజరయ్యారు . అబ్బూరి   రామకృష్ణారావు విశాఖ వచ్చిన తరువాత శ్రీ శ్రీ ,పురిపండా   అప్పలస్వామి లతో కలిసి  ఆంద్ర లేఖిని సంఘం స్తాపించారు . శ్రీశ్రీ  భావకవిత్వం నుండి అభ్యుదయ కవిత్వం లోకి ప్రవేశించారు . 

1942 లో క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది . ప్రపంచ యుద్ధం జరుగుతూ వుంది . ఫాసిజం రష్యా చేతిలో ఓడిపోతూ వుంది  1943లో తాపిధర్మారావు అధ్యక్షతన అభ్యుదయ రచయతల  సంఘం ఏర్పడింది శ్రీ మహాప్రస్తానంఆరుద్ర త్వమేవాహం ,సోమసుందర్ వజ్రాయుధం,రమణారెడ్డి అ డవి ,గంగినేని ఉదయిని మొదలైన కవిత సంపుటాలు   వచ్చాయి . చాసో కుంకుడాకు ,బొండుమల్లెలు ,కుక్కుటేశ్వర మ్ మొదలైన  కథలు రచించారు . 1935-45 వరకు అభ్యుదయం మొదటి దశ ,ఆతరువాత 1945 -50వరకు రెండవ దశగా భావించవచ్చు . రెండవ దశలో తిలక్,కుందుర్తి ,మొదలైన వారున్న్నారు. వీరంతా నెహ్రూ ప్రభావంలో  వున్నారు. వీరు శాంతి గీతాలను ఆలపించారు. 1950  నుండి 1965 వరకు సాహిత్యరంగంలో స్తబ్దత ఏర్పడింది . అయితే 1952 లో సాహిత్య అకాడెమీ ఏర్పడింది . 1952 లో పాలగుమ్మి  పద్మరాజు రాసిన  గాలివాన కథకు అంతర్జాతీయ బహుమతి లభించింది . ఈ కాలం లో సాహిత్యం ఒక వుద్యమంగా సాగలేదు 1955లో  లో  ప్రేమ  కథలు వచ్చాయి . ఈ కథలన్నీ మధ్య తరగతికి చెందిన కాలేజీచదువుకొనే   అబ్బాయి అ మ్మాయి ల ప్రేమ కథలు ..55-67 మధ్య తిలక్ కథలు వచ్చాయి . ఇవన్నీ పునాదిలేని కథలు . 1952లో  కమ్యూనిస్తుపార్టీ  ఎన్నికల్లో ఓడిపోయింది . అభ్యుదయ కవులంతా సినిమారంగం లోకి వెళ్ళిపోయారు . 1964లో కమ్యునిస్టు పార్టీ చీలిపోయింది . 1950లో  అమెరికాలో బీట్నిక్స్ కవులు  వచ్చారు . బ్రిటన్లో యాంగ్రీయంగ్మన్ కవులు నేక్డ్ పొయట్స్ వచ్చారు . 1958లో బెంగాల్ లో ఆకలితరం కవులు తిరుగుబాటు చేసారు . వీరి ప్రభావం వల్ల కావచ్చు 1965లో  స్తబ్దతను బద్దలు చేస్తూ దిగంబరకవులు వచ్చారు . తమకవిత్వానికి దిక్ లని పేరు పెట్టారు .


వీరునగ్నముని ,నిఖిలేశ్వర్,జ్వాలాముఖి ,చెరబండరాజు మహాస్వప్న ,భైరవయ్య . వీళ్ళు లైంగిక ప్రతీకలను తమ కవితల్లో వాడారు . అశ్లీలత ఎక్కువ . సమాజానికి షాక్ ట్రీట్మెంట్ అనేవాళ్ళు . ఇవన్నీ స్త్రీలను కించపరిచేవిధంగా ఉండేవి .పుండ్లు    పడిపోయిన వక్షం ,పుచ్చిపోయిన పిండం ,మెదడు పురుగు తినేసింది. చర్మం కుళ్ళిపోయింది . అవయవం  పుచ్చిపోయింది . కళ్ళకి కన్నం పడింది . 

1969-71లో కిర ణ్ బాబు ,దేవిప్రియ,ఓల్గా ,కమలనాథ్ లు  పైగంబరకవులుగా వచ్చారు . 1968-70 ,వరంగల్ లో కిషన్రావు ,సుదర్సన్రాలవు లోచన్ ,యాదగిరిరావు ,వరవరరావు ,టంకశాల అశోక్  తిరగబడు కవులుగా వచ్చారు . 1967 లోసి పి  యం  పార్టీ  చీలిపోయింది . సిపిఐ (యమ.ల్ ) ఎర్పడింది  . అదే సందర్బంలో  1970 లో శ్రీ శ్రీ  షష్టి  పూర్తీ జరుగుతుండగా  రచయతలారా మీరెటువైపు అనే కరపత్రం వేసి  శ్రీ శ్రీ తో సహా చాలామంది విరసం ఏర్పాటు చేసారు . శ్రీ శ్రీ అధ్యక్షుడు గా అయ్యాదు. కోకు ,రావిశాస్త్రి ,కే.వి.ఆర్ ,కారాగద్దర్ ,వంగపండు,నగ్నముని,జ్వాలాముఖి ,కే.శివారెడ్డి ,వరవరరావు ,నిఖిలేశ్వర్  మొదలైన వారు చేరారు . సృజన మాసపత్రిక  ప్రారంబ మైన్ది. కాని 1975 నాటికి విరసం తన ప్రాభవం కోల్పోయింది . విరసం లో చీలికలు వచ్చాయి . జనసాహితి  ఏర్పడింది . ఇదికూడా మళ్ళీ చీలిపోయింది . 


1980లో స్త్రీ వాదం దళిత వాదం  ప్రవేశించాయి . 1960-70 లలో యూరప్ దేశాలలో వచ్చిన స్త్రీ వాదం 1980 లలో ఆంధ్రదేశం లో  ప్రవేశించింది .1980లో రష్యాలో పెరిస్త్రోయికా గ్లాస్నోస్త్  మొదలైన మార్పులు వచ్చాయి .  1983లో తెలుగు దేశం పార్టీ ఆవిర్బవించింది . రామారావు మహిళకు ఆస్తిహక్కులో సమానవాటా ఇస్తానని ప్రకటించి అధికారములోకి వచ్చాడు . మగకీ ఆడకీ శీలాన్నీ ఆస్తినీఎ సమంగా వర్తిమ్పించండి  / కాగితాల మీద  వేదికల మెడ కాదు. ,నిజంగా సమంగా వర్తిమ్మ్పించండి ఇలా  కవిత వచ్చింది .   1993లో నీలిమేఘాలు  కవితా సంకలనం వచ్చింది . స్త్రీ వాదం క్రింది సమస్యలను ప్రస్తావించింది . స్త్రీని పురుషుడు దోపిడీ చేస్తున్నాడు . 2. స్త్రీఎ పురుషుల మధ్య సమానత్వం వుండాలి . 3.స్త్రీ పునరుత్పత్తి లో నిర్ణయాధికారం స్త్రీ     కి  వుండాలి . ప్రపంచీకరణ ,వ్యాపార ధోరణులు ప్రభావం తో స్త్రీ వాదం బలహీన పడింది .

 1969 నుండి దళిత సాహిత్యం ముందుకు వచ్చింది .పూలేఅంబేద్క ర్ ,మార్క్స్  ఆలోచనా ప్రభావంతో దళిత సాహిత్యం రూపు దిద్దుకుంది .నలుపు పత్రిక నదిచిన్ది.1970లో వికసించింది 1980లో ప్రవాహంగా రూపుదిద్దుకుంది . 1983లో రామారావు ప్రభుత్వం వచ్చింది . ఆకాలం లోనే వేంపెంట ,చుండూరు ,కారంచేడు  సంఘటనలతో దళిత సాహిత్యం ప్రబలంగా  వచ్చింది .  నాకు చరిత్ర లేదునాలుగు వేదాల్లోంచిపాదాఅలలొంచి నన్ను తొలగించారు అంటూ బోజ్జాతారకం రాసారు . నిజం చెప్పండి ,పంచముడంటే  వేలు లేని వాడ్నేనా అర్థం,మా ముత్తాత  ఏకలవ్యుడు చెప్పాడు అని ప్రశ్నించాడు సత్తీష్ చందర్ . 

మైనారిటి వాద సాహిత్యం పుట్టుమచ్చతో ప్రారంబమైనా గుజరాత్ లో మోడీ నాయకత్వం లో ముస్లిం ల పై పై జరిగిన అమానుష కాండ తరువాత గుజరాత్ గాయం వచ్చింది . జలజల ఆజా ,మొదలైన మైనారిటి  వాద సాహిత్యం ముందుకు వచ్చింది . నేను పుట్టక ముందే ,దేసద్రోహుల జాబితాలో నమోదైవుంది  నా పేరు  అంటూ ఆక్రోశం వ్యక్తం చేసాడు ఖాదర్ మొహిద్దీన్ . 


1990 తరువాత ప్రపచీకరణ ప్రారంబం అయ్యాక మనిషి మాయమై పోయాడు . 20 వ శతాబ్దంలో మనిషి మరనిస్తున్నాడని  ఫ్రామ్ అన్నాడు . వ్యకి వాదం,ఆసలుస్వార్థంవుద్యొగాకవశాలు సంపాదనలు ప్రదానమైనాయి . 

బషీర్బాగ్ లో విద్యుత్ చార్జీల  పెంపు పై ప్రజాపోరాటం పై ప్రభుత్వం జరిపిన మారణకాండ తో  కవులు రచయతలు మెల్కొన్నారు. వికసించిన విద్యుత్ తేజం కవితా సంకలనం వచ్చింది . వ్యక్తులుగా విడిపోయిన సాహిత్యకారులను ఒక్క్కటి చేసేందుకు సాహితీ స్రవంతి ఏర్పడింది . ప్రపంచీకరణ మతోన్మాదం ఉగ్రవాదం లకు వ్యతిరేకంగా కలిసి వచ్చే సాహిత్యకారులందరిని ఒకవిశాలవెదిక మీదకు తెచ్చేందుకు సాహితీ స్రవంతి కృషిచేయడం ప్రారంబించింది . 2001 లో ఏర్పడిని ఈ సంస్త సాహిత్య ప్రస్తానం పత్రికను  తప్పకుండా ప్రచురిస్తోంది . నూతన సాహిత్యకారులకు ప్రోత్సాహానిస్తోంది . సాహితీ  యవనికపై చెరగని ముద్రను ముద్రను వేస్తోంది .

 

రాష్ట్ర కార్యదర్శి రఘుబాబు గారు మాట్లాడుతూ రాయలసీమ లో వేమన బ్రహ్మంగారు,అన్నమయ్య ప్రసిద్ద్దకవులని పేర్కొన్నారు . రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం  వామపక్ష రాజకీయాలకు పెట్టింది పేరని చెప్పారు. 

తరిమెల నాగిరెడ్డి ,నీలం రాజశేఖర రెడ్డి,రవూఫ్ మొదలైన వారంతా  వామపక్షరాజకీయాలను పెంపొందించా రని  ఆయన అన్నారు . నేటి రచయతలు సింగమనేని రాచపాలెం మొదలైన వారంతా మార్క్సిస్టు దృక్పథం తో రాస్తున్న రచయతలని వారి మధ్య మీరు వుండటం అదృష్టమని ఆయన అన్నారు . కథ కవిత్వం పై సాహిత్య సాల నిర్వహించడం యువరచయతలకు చాల ప్రోత్సాహ కరంగా ఉంటుందని ఆయన అన్నారు . 


కథా రచయిత్రి శశికళ గారు కొన్ని కథ లను చెప్పి కథలెలా రాస్తారో వుదహరించారు. చిన్నపిల్లల  కథలు కొన్ని వినిపించి పిల్లలకు వుత్సాహాన్ని కలిగించారు .

బండి నారాయణ స్వామి  తన చావుకూడు కథను చెప్పాడు . కథలో సంఘటలన్నీ ఒక చోట నుంచీ తీసుకోలేదని వేరు వేరు ప్రాంతాలలో జరిగిన వాటిని కలిపి ఒక కథగా రాసానని అయన వివరించారు . కథలెలా రాస్తారు అన్న ఒక వ్యాసం నకళ్ళ ను  కొన్నింటిని తెచ్చి అందరికి పంచారు . 

                   భోజనాంతరం కవిత్వం పై సాహిత్యశాల నిర్వహించారు 

    కథావస్తువును ఎలా గుర్తించాలో ప్రముఖ కవి రాధేయ గారు వివరించారు . చేనేత కార్మికుల వ్యధ లైనా,రైతుల ఆత్మహత్యలైనా విద్యార్ధి విజయమైనా మహిళల ఆక్రందనైనా కవిత్వంలో ఒదిగించవచ్చని చెప్పారు .మన చుట్టూ వున్న సమాజమే మనకు కవితా వస్తువును అందిస్తుందని ఆయన అన్నారు. రాసిన కవితను పలు మార్లు దిద్దుకోవాలని ఆయన చెప్పారు . కవిత్వం బాగా రాయాలంటే మంచి  కవితా  పుస్తకాలను బాగా చదవాలని ఆయన కొరారు. 


కవితా శిల్పాన్నిగురించ ప్రముఖ కవి మల్లెల నరసింహమూర్తి గారు చక్కగా వివరించారు . నల్ల ద్రాక్షపందిరి లోని కవితలను ఆయన వుదహరించి  ఎలా తీర్చి దిద్దాలో ఆయన వివరించారు . ఘూర్కా  శిఖామణి రాసిన కవితను ఉదహరిస్తూ సిల్పనిర్మానం ఎలాచేయాలో వివరించారు . మన చుటూ వున్నా విషయాలను మనం గమనించి వాటిని పద చిత్రాలలోనూ భావ చిత్రాలలోనూ రాయాలని ఆయన చెప్పారు . ఎలా చెప్పితే  పాటకునికి హత్తుకుంటుందో అదే  శిల్పమని ఆయన చెప్పినారు . శిల్పము ,వస్తువు కవిత్వానికి రెండు రథ చక్రాలాంటివని అన్నారు . కవిత్వం కావాలి కవిత్వం లేదంటే వచనమై తేలిపోతావ్ అని అంటాడు త్రిపురనేని శ్రీనివాస్ . శిల్పం మెరుగు పరుచుకోవాలంటే కవిత్వం ఒక శ్వాసగా ధ్యాసగా చదవాలి అని ఆయన ఆన్నారు . 

 

 

 

 


No comments:

Post a Comment